గుజరాత్లో ఘోర రోడ్డు ప్రమాదం... కారు-ట్రక్కు ఢీ... 10 మంది అక్కడికక్కడే మృతి
గుజరాత్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు-ట్రక్కు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో 10 మంది అక్కడికక్కడే మృతి చెందారు. గుజరాత్లోని ఆనంద్ జిల్లాలో తారాపూర్-వతమాన్ హైవేపై ఇంద్రనాజ్ గ్రామ సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
ప్రమాదంలో మృతి చెందినవారంతా కారులో ఉన్నవారేనని తారాపూర్ పోలీసులు తెలిపారు. మొత్తం 10 మంది మృతుల్లో ఒక చిన్నారి కూడా ఉన్నట్లు వెల్లడించారు. ప్రమాద సమయంలో కారు వతమాన్ వైపు వెళ్తుండగా... ట్రక్కు ఎదురుగా వచ్చిందని పోలీసులు తెలిపారు. ప్రమాదంలో కారు నుజ్జునుజ్జవడంతో మృతదేహాలు అందులోనే చిక్కుకుపోయాని తెలిపారు. సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నాయని చెప్పారు.

Recommended Video
రెండు నెలల క్రితం గుజరాత్లోని సూరత్లోనూ ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఓ ట్రక్ డ్రైవర్ నిర్లక్ష్యానికి ఏకంగా 15 మంది మృతిచెందారు. పుట్పాత్పై నిద్రిస్తున్న కూలీల పైకి ఓ భారీ ట్రక్కు వారిపై దూసుకెళ్లడంతో 12 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. మృతుల్లో పొట్టకూటి కోసం రాజస్తాన్ నుంచి వలస వచ్చిన కూలీలు కూడా ఉన్నారు. గుజరాత్లోని సూరత్ జిల్లా కోసంబి పట్టణంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications