సామాన్యులు తినే రెస్టారెంట్లో రాహుల్ గాంధీ డిన్నర్, అందరూ ఆశ్యర్యపోయారు
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఉన్న ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ గురువారం రాత్రి వాపిలోని ఓ రెస్టారెంటులో భోజనం చేశారు.
అహ్మదాబాద్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఉన్న ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ గురువారం రాత్రి వాపిలోని ఓ రెస్టారెంటులో భోజనం చేశారు.
సాదారణ పౌరులతో కలిసి ఆయన భోజనం చేసేందుకు సిద్ధమయ్యారు. భద్రతా అంశాలను పక్కన పెట్టి ఆయన కామన్ పీపుల్తో కలిసి రాత్రి భోజనం చేశారు.

అక్కడ ఆయన గుజరాతి ఖాడీ కిచిడీని ఆయన తన రాత్రి భోజనంలో తీసుకున్నారు. ఆయనతో పాటు అహ్మద్ పటేల్, భరత్ సిన్హ సోలంకి, అర్జున్ మోద్వాడియా, శక్తిసింహా గోహ్లీ, అశోక్ గెహ్లాట్ తదితరులు భోజనం చేశారు.

సాధారణ పౌరులు తినే రెస్టారెంటులో రాహుల్ గాంధీ భోజనం చేయడాన్ని చూసి అక్కడ చూసిన వారు ఆశ్చర్యపోయారు. భోజనం చేస్తున్న దృశ్యాలను రాహుల్ అండ్ టీం సెల్ఫీ తీసుకున్నారు.












Click it and Unblock the Notifications