యువతిని హోటల్కు తీసుకెళ్లి ఫేస్బుక్ ఫ్రెండ్ పలుమార్లు రేప్
ఢిల్లీ: తన పైన ఫేస్బుక్ ద్వారా పరిచయమైన స్నేహితుడు అత్యాచారానికి పాల్పడ్డాడని ఓ యువతి పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి వయస్సు 19. తనను 22 ఏళ్ల తన స్నేహితుడు అత్యాచారం చేశాడని బుధవారం పోలీసులకు చెప్పింది.
ఈ సంఘటన గుర్గావ్లో జరిగింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఆమె రాజన్ మల్హోత్రా అనే వ్యక్తి పైన ఆరోపణలు చేసింది. అతనిని అరెస్టు చేయాల్సి ఉంది.
తాము సామాజిక అనుసంధాన్ వెబ్సైట్ ఫేస్బుక్ ద్వారా పరిచయమయ్యామని, అలాగే పెళ్లి చేసుకుందామనుకున్నామని పోలీసులకు తెలిపింది. ఓసారి అతను గుర్గావ్ వచ్చి, ఓ హోటల్లో తన పైన అత్యాచారానికి పాల్పడ్డాడని తెలిపింది. ఇలా పలుమార్లు వచ్చి తన పైన అత్యాచారం చేశాడని చెప్పింది.
అయితే, అతను తన ఫేస్బుక్ అకౌంటును డిలీట్ చేసిన అనంతరం ఆమె ఫిర్యాదు చేసింది. నిందితుడి మొబైల్ నెంబర్ను ట్రేస్ చేయాల్సి ఉంటుందని పోలీసులు తెలిపారు. సదరు బాధిత మహిళ ఓ ప్రయివేటు కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. అతను ఏం ఉద్యోగం చేస్తున్నాడో, ఎక్కడుంటాడో తదితర విరాలు తెలియవు.