జ్ఞానవాపి మసీదు వివాదం- శివలింగం సమాచారం లీక్-సర్వే అధికారి తొలగింపు-సుప్రీం కీలక వ్యాఖ్యలు

ఉత్తర్ ప్రదేశ్ లోని కాశీ విశ్వనాధుని ఆలయం సమీపంలో ఉన్న జ్ఞానవాపి మసీదు వివాదం మరింత ముదురుతోంది. ఇప్పటికే అక్కడ సర్వే నిర్వహిస్తున్న సర్వే ఆఫ్ ఇండియా అధికారులు అక్కడ శివలింగం దొరికిందంటూ ఓ సమాచారాన్ని లీక్ చేయడం కలకలం రేపింది. ఈ నేపథ్యంలో ఈ కేసును విచారిస్తున్న వారణాసి కోర్టు సర్వే ఆఫ్ ఇండియా అధికారిని విధుల నుంచి తొలగిస్తూ ఆదేశాలు ఇచ్చింది.

వారణాసి జిల్లా కోర్టు సర్వే ఉత్తర్వులను సవాల్ చేస్తూ మసీదు కమిటీ వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఇవాళ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి, హిందూ పిటిషనర్లకు నోటీసులు జారీ చేసింది. దీనిపై కోర్టు ఈ నెల 19న మరోసారి విచారణ చేపట్టనుంది. మరోవైపు న్యాయవాది-కమీషనర్‌ అజయ్‌ కుమార్‌ మిశ్రాను వారణాసి కోర్టు ఆ పదవి నుంచి తొలగించింది. మిశ్రా కాశీ విశ్వనాథ దేవాలయం-జ్ఞాన్వాపి మసీదు సముదాయం యొక్క చిత్రీకరణ మరియు సర్వేను నిర్వహించే బాధ్యతను నిర్వర్తించారు. కమిటీ సర్వే నివేదిక సమర్పణకు రెండు రోజుల గడువును కూడా కోర్టు మంజూరు చేసింది. అంతకుముందు నిన్న వారణాసి కోర్టు మసీదు సముదాయంలోని వీడియోగ్రఫీ సర్వేలో శివలింగం దొరికిన ప్రదేశానికి సీలు వేయాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది.

Gyanvapi Mosque Row : SC suggests it can ask trial court to first hear masjid panels plea

వారణాసిలోని అంజుమన్ ఇంతేజామియా మసీదు కాంప్లెక్స్‌లోని మా శృంగార్ గౌరీ స్థల్‌లోని స్థానిక కోర్టు ఆదేశించిన వీడియోగ్రఫీ సర్వేను సవాల్ చేస్తూ కమిటీ ఆఫ్ మేనేజ్‌మెంట్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారిస్తోంది. ఇది ప్రార్థనా స్థలాల (ప్రత్యేక నిబంధనలు) చట్టం 1991 నిబంధనలకు విరుద్ధమని ముస్లిం సంఘం వాదిస్తోంది. అప్పీల్‌ను కొట్టివేయాలని కోరుతూ హిందూ సేన అధ్యక్షుడు సుప్రీం కోర్టులో జోక్యం చేసుకున్నారని తెలుస్తోంది.

వాస్తవానికి జ్ఞాన్‌వాపి మసీదు సముదాయ ప్రాంగణాన్ని సర్వే చేసేందుకు వారణాసి కోర్టు నియమించిన బృందానికి తన నివేదికను కోర్టు ముందు సమర్పించేందుకు రెండు రోజుల గడువు ఇచ్చింది. ఈ కేసును విచారిస్తున్న వారణాసిలోని సివిల్ కోర్టు తాను నియమించిన ముగ్గురు కమిషనర్లలో ఒకరిని అజయ్ మిశ్రాను తొలగించింది. మిశ్రా సహాయకుడు సర్వేకు సంబంధించిన సమాచారాన్ని మీడియాకు లీక్ చేసినట్లు సమాచారం. దీంతో మిగిలిన ఇద్దరు విశాల్ సింగ్, అజయ్ ప్రతాప్ కోర్టు కమిషనర్, డిప్యూటీ కోర్టు కమిషనర్‌గా కొనసాగుతారని కోర్టు పేర్కొంది.

కాశీ విశ్వనాథ దేవాలయం పక్కనే ఉన్న వారణాసిలోని జ్ఞాన్వాపి మసీదు సుదీర్ఘ న్యాయ పోరాటంలో చిక్కుకుంది. ఆలయాన్ని కూల్చివేసి మసీదు నిర్మిస్తున్నారనే వాదనలు రావడంతో వారణాసిలోని న్యాయస్థానం మసీదు నిర్మాణంపై విచారణ జరపాలని భారత పురావస్తు శాఖ (ఏఎస్‌ఐ)ని ఆదేశించింది.16వ శతాబ్దంలో కాశీ విశ్వనాథ ఆలయాన్ని కూల్చివేసి మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు మసీదును నిర్మించారని ఆరోపిస్తూ సుప్రీంకోర్టు, అలహాబాద్ హైకోర్టు, వారణాసి కోర్టుల్లో పలు పిటిషన్లు దాఖలయ్యాయి.పిటిషనర్లు, స్థానిక పూజారులు జ్ఞాన్వాపి మసీదు సముదాయంలో పూజలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ వారణాసి కోర్టులో 1991లో ఒక పిటిషన్ దాఖలు చేశారు.

ఔరంగజేబు ఆదేశాల మేరకు 16వ శతాబ్దంలో కాశీ విశ్వనాథ దేవాలయంలో కొంత భాగాన్ని కూల్చివేసి ఈ మసీదును నిర్మించారని పిటిషనర్లు పేర్కొన్నారు. వారణాసికి చెందిన విజయ్ శంకర్ రస్తోగి అనే న్యాయవాది జ్ఞానవాపి మసీదు నిర్మాణంలో చట్టవిరుద్ధమని పేర్కొంటూ దిగువ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మసీదులో పురావస్తు సర్వే కోరారు. ఇది డిసెంబర్ 2019లో అయోధ్యలోని బాబ్రీ మసీదు-రామజన్మభూమి టైటిల్ వివాదంలో సుప్రీంకోర్టు తీర్పు తర్వాత వచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+