విశ్వాసం: కేజ్రీవాల్కు బిజెపి ప్రశ్నల వర్షం, కాంగ్రెస్ విప్

ఎఎపి ఢిల్లీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందన్నారు. కాంగ్రెసు పార్టీతో చేయి కలపాల్సిన అవసరం ఏమొచ్చిందన్నారు. ప్రజాకర్షక పథకాలు అమలు చేయడంలో చూపిస్తున్న శ్రద్ధ అవినీతి రూపు మాపడంలో చూపించడం లేదని ఆరోపించారు. ఎమ్మెల్యేలు మెట్రో రైలులో, బస్సుల్లో ప్రయాణించడం గొప్ప విషయం కాదని, అలా చౌకబారు ప్రచారం చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
కాశ్మీర్ పైన చేసిన వ్యాఖ్యలకు కేజ్రీవాల్ క్షమాపణలు చెప్పాలన్నారు. తాము కూడా నీతివంతమైన రాజకీయాల కోసం డిమాండ్ చేస్తున్నామన్నారు. ఎఎపి ఫండ్స్ పైనా హర్షవర్ధన్ ప్రశ్నల వర్షం గుప్పించారు. అవినీతికి వ్యతిరేకమంటున్న ఎఎపి అవినీతిమయమైన కాంగ్రెసు పార్టీ మద్దతును ఎలా తీసుకుందని ప్రశ్నించారు.
సభలో గందరగోళం
ఢిల్లీ శాసన సభలో మొదట గందరగోళం ఏర్పడింది. ఎఎపి ఎమ్మెల్యేలు టోపీలు ధరించి సభకు రావడంపై బిజెపి సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. సభలోనే వారు ఆందోళన చేపట్టారు. బిజెపి ఎమ్మెల్యేల ఆందోళన మధ్యే సిసోడియా విశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టారు. విశ్వాస తీర్మానాన్ని బిజెపి వ్యతిరేకించింది.
కాంగ్రెసు పార్టీ విప్
కేజ్రీవాల్ ప్రభుత్వానికి మద్దతివ్వాలని కాంగ్రెసు పార్టీ తమ పార్టీకి చెందిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసింది.
-
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ!












Click it and Unblock the Notifications