గర్ల్పై రెండ్రోజులు గ్యాంగ్ రేప్: మరణశిక్ష విధించిన కోర్టు

2012లో అత్యాచారానికి గురైన యువతి మృతదేహం కొద్ది రోజుల తర్వాత రేవారి ప్రాంతంలో గుర్తించారు. దీనిపై పోలీసులు విచారణ జరిపారు. యువతి ఇంటికి వెళ్తుండగా దోషులు ముగ్గురు ఎత్తుకెళ్లినట్లు, అత్యాచారానికి పాల్పడినట్లు విచారణలో తేలింది.
నిందితులకు మరణ శిక్ష విధించాలని కుటుంబ సభ్యులు అప్పటి నుండి డిమాండ్ చేస్తున్నారు. ఢిల్లీ పోలీసులు కూడా నిందితులకు ఉరిశిక్షనే వేయాలని కోరారు. కేసు నడుస్తున్న సమయంలో నిందితులు ముగ్గురు ఎలాంటి పశ్చాత్తాపం వ్యక్తం చేయలేదు.
2012 ఫిబ్రవరి 9, 10 తేదీలలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు దోషుల పైన అప్పుడు కిడ్నాప్, అత్యాచారం, సామూహిక అత్యాచారం, హత్య సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.












Click it and Unblock the Notifications