విధుల్లో చేరితేనే డిమాండ్ల పరిష్కారం .. దీదీ మరోసారి అల్టిమేటం
కోల్కతా : పశ్చిమ బెంగాల్లో జూనియర్ డాక్టర్ల ఆందోళన పీక్ స్టేజీకి చేరడంతో ఆ రాష్ట్ర సీఎ మమతా బెనర్జీ దిగొచ్చారు. వైద్యుల డిమాండ్లపై చర్చించేందుకు సిద్ధమని స్పష్టంచేశారు. వైద్యులు చెప్తున్న డిమాండ్లన్నీ పరిష్కరిస్తామని హామీనిచ్చారు. ఇకనైనా ఆందోళన విరమించాలని ఎన్ఆర్ఎస్ జూనియర్ డాక్టర్లను కోరారు దీదీ

బాధ్యత మాది ..
జూనియర్ డాక్టర్లు చేస్తున్న డిమాండ్లన్నీ పరిష్కారిస్తామని సీఎం మమత స్పష్టంచేశారు. అయితే వైద్యులు విధుల్లో చేరాలని కోరారు. విధుల్లో చేరితే జూనియర్ డాక్టర్లు కోరుతున్న దానికంటే ఎక్కువ తీరుస్తామని తేల్చిచెప్పారు. గత ఐదురోజులుగా డాక్టర్లు ఆందోళన చేస్తున్న వారి పట్ల తాము మెతకవైఖరి అవలంభిస్తున్నామని పేర్కొన్నారు. రోగులకు సేవలు అందించకున్నా .. ఎస్మా లాంటి చట్టాన్ని ప్రయోగించలేదని గుర్తుచేశారు.

రోగుల కోసం ..
రోగుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని వెంటనే విధుల్లో చేరాలని కోరారు. వారు విధుల్లో చేరితే తాము వారు కోరిన కోరికలు తీరుస్తామని పేర్కొన్నారు. రోగుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకునే తాము మెతకవైఖరి అవలంభిస్తున్నామని మరోసారి ఉద్ఘాటించారు. ఎస్మా లాంటి చట్టాలే కాదు .. వైద్యులను అదుపులోకి తీసుకోలేదని గుర్తుచేశారు. వైద్యుల న్యాయమైన డిమాండ్లన్నీ పరిష్కరించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉందని పేర్కొన్నారు.

నిరసనకు కారణమిదీ ..
గత సోమవారం ఎన్ఆర్ఎస్ ఆస్పత్రిలో రోగి బంధువులు బీభత్సం సృష్టించి నంగతి తెలిసిందే. తమ బంధువు చనిపోవడానికి జూనియర్ డాక్టర్లు పరిబర ముఖపాధ్యాయ్, యాష్ కారణమని దాడిచేశారు. దాదాపు 200 మంది ఆస్పత్రిలో నానా హంగామా చేశారు. ముఖపాధ్యాయ తలపై వెనక నుంచి ఇటుకపెళ్లతో దాడిచేయడంతో పుర్రె ఎముక విరిగింది. దీంతో తొలుత ఎన్ఆర్ఎస్ ఆస్పత్రిలో చికిత్స అందించారు. తర్వాత పార్క్ సైన్స్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. వైద్యులపై దాడిని నిరసిస్తూ ఎన్ఆర్ఎస్ డాక్టర్లు నిరసన చేపట్టిన సంగతి తెలిసిందే.
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications