వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విధుల్లో చేరితేనే డిమాండ్ల పరిష్కారం .. దీదీ మరోసారి అల్టిమేటం

|
Google Oneindia TeluguNews

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లో జూనియర్ డాక్టర్ల ఆందోళన పీక్ స్టేజీకి చేరడంతో ఆ రాష్ట్ర సీఎ మమతా బెనర్జీ దిగొచ్చారు. వైద్యుల డిమాండ్లపై చర్చించేందుకు సిద్ధమని స్పష్టంచేశారు. వైద్యులు చెప్తున్న డిమాండ్లన్నీ పరిష్కరిస్తామని హామీనిచ్చారు. ఇకనైనా ఆందోళన విరమించాలని ఎన్ఆర్ఎస్ జూనియర్ డాక్టర్లను కోరారు దీదీ

బాధ్యత మాది ..

బాధ్యత మాది ..

జూనియర్ డాక్టర్లు చేస్తున్న డిమాండ్లన్నీ పరిష్కారిస్తామని సీఎం మమత స్పష్టంచేశారు. అయితే వైద్యులు విధుల్లో చేరాలని కోరారు. విధుల్లో చేరితే జూనియర్ డాక్టర్లు కోరుతున్న దానికంటే ఎక్కువ తీరుస్తామని తేల్చిచెప్పారు. గత ఐదురోజులుగా డాక్టర్లు ఆందోళన చేస్తున్న వారి పట్ల తాము మెతకవైఖరి అవలంభిస్తున్నామని పేర్కొన్నారు. రోగులకు సేవలు అందించకున్నా .. ఎస్మా లాంటి చట్టాన్ని ప్రయోగించలేదని గుర్తుచేశారు.

రోగుల కోసం ..

రోగుల కోసం ..

రోగుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని వెంటనే విధుల్లో చేరాలని కోరారు. వారు విధుల్లో చేరితే తాము వారు కోరిన కోరికలు తీరుస్తామని పేర్కొన్నారు. రోగుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకునే తాము మెతకవైఖరి అవలంభిస్తున్నామని మరోసారి ఉద్ఘాటించారు. ఎస్మా లాంటి చట్టాలే కాదు .. వైద్యులను అదుపులోకి తీసుకోలేదని గుర్తుచేశారు. వైద్యుల న్యాయమైన డిమాండ్లన్నీ పరిష్కరించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉందని పేర్కొన్నారు.

 నిరసనకు కారణమిదీ ..

నిరసనకు కారణమిదీ ..

గత సోమవారం ఎన్ఆర్ఎస్ ఆస్పత్రిలో రోగి బంధువులు బీభత్సం సృష్టించి నంగతి తెలిసిందే. తమ బంధువు చనిపోవడానికి జూనియర్ డాక్టర్లు పరిబర ముఖపాధ్యాయ్, యాష్ కారణమని దాడిచేశారు. దాదాపు 200 మంది ఆస్పత్రిలో నానా హంగామా చేశారు. ముఖపాధ్యాయ తలపై వెనక నుంచి ఇటుకపెళ్లతో దాడిచేయడంతో పుర్రె ఎముక విరిగింది. దీంతో తొలుత ఎన్ఆర్ఎస్ ఆస్పత్రిలో చికిత్స అందించారు. తర్వాత పార్క్ సైన్స్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. వైద్యులపై దాడిని నిరసిస్తూ ఎన్ఆర్ఎస్ డాక్టర్లు నిరసన చేపట్టిన సంగతి తెలిసిందే.

English summary
West Bengal Chief Minister Mamata Banerjee on Saturday said that she was open to talks with the protesting doctors and also wanted the stir to end in the state. In a press conference, Mamata Banerjee said that the state government had accepted all the demands of the agitating doctors. "We have accepted all demands of agitating doctors. We are ready to accept more, but they must rejoin service," Mamata Banerjee said. She also said that even after five days of strike by junior doctors, the state government has not invoked ESMA Act or taken any action against them.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X