ఇన్ స్టాగ్రామ్ లో యువతి ఫోటోలు తీసి కాల్ గర్ల్స్ వాట్సాప్ గ్రూప్ లో పోస్టు !
బెంగళూరు: ఓ యువతి తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన ఫోటోలు ఉపయోగించిన దుండగులు ఎస్కార్ట్ సర్వీస్ (కాల్గర్ల్) అనే వాట్సాప్ గ్రూప్లో ఆమె ఫోటోలు పోస్టు చేశారు. ఆ యువతి ఫోటోలు కాల్ గర్ల్స్ వాట్సాప్ గ్రూప్ లో హల్ చల్ చేశాయి. చివరికి యువతి స్నేహితుడు ఆమె ఫోటోలు ఎస్కార్ట్ సర్వీస్ లో చూసి హడలిపోయి ఆమెకు విషయం చెప్పాడు.
బెంగళూరులోని మారతహళ్లిలో నివాసం ఉంటున్న 30 ఏళ్ల యువతి పోలీసులను అశ్రయించింది. తనను మానసికంగా వేధిస్తున్నారని ఆరోపిస్తూ సెంట్రల్ డివిజన్లోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది.

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి నిందితుడి ఆచూకీ కోసం దర్యాప్తు చేపట్టామని పోలీసు అధికారులు తెలిపారు.
బాధితురాలు తన పోర్ట్రెయిట్లను పోస్ట్ చేసిన సోషల్ నెట్వర్కింగ్ సైట్ Instagram ఖాతాను కలిగి ఉంది. దుండగులు ఇన్ స్టాగ్రామ్ లోని ఆమె ఫోటోలు తీసి ఎస్కార్చ్ సర్వీస్ (కాల్ గర్ల్) అనే వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేశారు. ఈ గ్రూప్లో 27 మంది యువతుల పోర్ట్రెయిట్లు ఉన్నాయని, అందులో బాధితురాలి ఫోటోలు కూడా ఉండడంతో ఆమెకు బాగా తెలిసిన వ్యక్తి గమనించి బాధితురాలి దృష్టికి తీసుకెళ్లాడు.
ఈ క్రమంలో బాధితురాలు గుర్తు తెలియని వ్యక్తిని వాట్సాప్ మెసేజ్ ద్వారా సంప్రదించగా ఫోన్ పే ద్వారా డబ్బులు చెల్లిస్తే పోర్ట్రెయిట్ లో మీ ఫోటోలు డిలీట్ చేస్తానని చెప్పాడు. దీని ప్రకారం, బాధితురాలు ఆమె స్నేహితుడి నుండి ఫోన్ పే ద్వారా నిందితుడికి డబ్బులు పంపించింది. అయితే దుండగుడు బాధితురాలి చిత్రపటాన్ని ఎస్కార్ట్ గ్రూప్ నుంచి తొలగించకుండా ఆమెను మానసికంగా వేధించాడు.

తన ఫోటోలు ఎస్కార్ట్ గ్రూప్ లో పెట్టి తనను మానసికంగా హింసిస్తున్న నిందితుడిపై తగిన చర్యలు తీసుకోవాలని బాధితురాలు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగా నిందితుడి కోసం వల పన్నినట్లు బెంగళూరు పోలీసు అధికారులు తెలిపారు. ఇప్పటికే ఎస్కార్ట్ గ్రూప్ లో ఆమె ఫోటోలు చూసి చాలా మంది ఆమెకు అసభ్యంగా మెసేజ్ లు పంపించారని తెలిసింది.












Click it and Unblock the Notifications