కాల్పుల విరమణ ఒప్పందానికి యధేచ్చగా తూట్లు .. పాక్ కాల్పులు .. తిప్పికొట్టిన భద్రతాదళాలు
శ్రీనగర్ : దాయాది పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తోంది. నియంత్రన రేఖ వెంబడి రోజు ఒక్కసారైనా కాల్పులకు తెగబడుతోంది. వైమానిక దాడుల తర్వాత సరిహద్దులో పాకిస్థాన్ మూకల కాల్పులు మరింత పెరిగాయి.
పాక్ కాల్పులు ... తిప్పికొట్టిన భద్రతాదళాలు
నియంత్రణ రేఖ వెంబడి ఉన్న నౌహిరా సెక్టార్ వద్ద పాకిస్థాన్ కాల్పులు జరిపింది. తుపాకీలతో కాల్పుల మోత మోగించిందని .. అందుకు ధీటుగా భారత భద్రతాదళాలు స్పందించాయని రక్షణశాఖ అధికార ప్రతినిది లెప్టినెంట్ కల్నల్ దేవేందర్ ఆనంద్ తెలిపారు. సుందర్ బని సెక్టార్ వద్ద నిన్న రాత్రి ప్రారంభించిన కాల్పులు తెల్లవారుజాము 4.30 గంటల వరకు కొనసాగాయన్నారు.

పరిస్థితిని సమీక్షించిన రావత్
పాక్ లో వైమానిక దాడుల తర్వాత సరిహద్దులో కాల్పుల విరమణ ఒప్పందం యధేచ్చగా ఉల్లంఘిస్తున్నారు. ఈ క్రమంలో ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ .. శనివారం జమ్ముకశ్మీర్ లో పర్యటించి .. పరిస్థితిని సమీక్షించారు. సాంబా, రత్నాచౌక్, తదితర ప్రాంతాలను స్వయంగా పరిశీలించి .. పరిస్థితిని తెలుసుకున్నారు.












Click it and Unblock the Notifications