అరుణ్ జైట్లీపై రాజద్రోహం కేసు కొట్టివేత: హైకోర్టు ఫైర్
అలహాబాద్: కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్జైట్లీపై రాజద్రోహం ఆరోపణలతో కోర్టు ప్రోసీడింగ్లను ప్రారంభించిన మహోబా జిల్లా మేజిస్ట్రేట్పై అలహాబాద్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
'జాతీయ న్యాయ నియామకాల కమిషన్'(ఎన్జేఏసీ) చట్టాన్ని రద్దు చేసిన సుప్రీంకోర్టు తీర్పుపై ఆర్ధికమంత్రి అరుణ్జైట్లీ చేసిన వ్యాఖ్యలను దేశద్రోహంగా పరిగగణిస్తూ మేజిస్ట్రేట్ తదనుగుణంగా ప్రొసీడింగ్లను ప్రారంభించడాన్ని ఖండించింది.
జైట్లీపై ఈ తరహా చర్యలు ప్రారంభించడానికి అర్హమైన అంశాలేవీ కనపడలేదని పేర్కొంది. ఈ మేరకు సంబంధిత మేజిస్ట్రేట్ అంకిత్ గొయెల్ జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జె.యశ్వంత్ వర్మ కొట్టివేశారు.
అవినీతి కేసుల్లో కేంద్ర మాజీ మంత్రి రాందాస్
వైద్య కళాశాలలకు అక్రమ అనుమతుల కేసుల్లో తనపై వచ్చిన అభియోగాలను కొట్టివేయాలన్న కేంద్ర మాజీ మంత్రి అన్బుమణి రాందాస్ విజ్ఞప్తిని సుప్రీంకోర్టు శుక్రవారం తోసిపుచ్చింది. ప్రత్యేక న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని న్యాయమూర్తులు జస్టిస్ టి.ఎస్.ఠాకుర్, జస్టిస్ వి.గోపాల గౌడతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.