Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Students: హిజాబ్, తీర్పు వచ్చిన గంటలో పరీక్షలు బహష్కరించిన అమ్మాయిలు, ఇంట్లో అడిగి !

బెంగళూరు/ యాదగిరి: హిజాబ్ వివాదానికి కర్ణాటక హైకోర్టు తీర్పుతో బ్రేక్ పడిందని చాలామంది అనుకున్నారు. ఇస్లాం మతంలో హిజాబ్ తప్పనిసరి కాదని మంగళవారం కర్ణాటక హైకోర్టు తీర్పు చెప్పింది. ప్రభుత్వం సూచించిన యూనీఫామ్ లు మాత్రమే వేసుకుని స్కూల్స్, కాలేజ్ కు వెళ్లాలని, ఎలాంటి మతపరమైన దస్లులు ధరించి విద్యాసంస్థలకు వెళ్లకూడదని హైకోర్టు సూచించింది. కర్ణాటక హైకోర్టు తీర్పు చెప్పిన గంటలోనే పరీక్షలు రాస్తున్న ముస్లీం విద్యార్థులు పరీక్షా కేంద్రం నుంచి బయటకు వెళ్లిపోయారు. హిజాబ్ లు వేసుకోకుండా మేము పరీక్షలు రామయని చెప్పి ఒకేసారి 35 మంది విద్యార్థులు పరీక్షలు బహిష్కరించడం కలకలం రేపింది. హిజాబ్ తీసేసి పరీక్షలు రాయాలా ?, వద్దా ? అనే విషయం మా కుటుంబ సభ్యులను అడిగి చెబుతామని ముస్లీం అమ్మాయిలు పరీక్షలు బహిష్కరించడం హాట్ టాపిక్ అయ్యింది. ఇదే సమయంలో హిజాబ్ తీర్పు తరువాత బెంగళూరు నగరంలో సహ కర్ణాటకలోని అనేక జిల్లాల్లోని విద్యాసంస్థల దగ్గర, పలు ప్రాంతాల్లోని సన్నితమైన ప్రాంతాల్లో కర్ణాటక పోలీసు అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

హైకోర్టు సంచలన తీర్పు

హైకోర్టు సంచలన తీర్పు

ఇస్లాం మతంలో హిజాబ్ అనేది ఒక భాగం కాదని, హిజాబ్ లు కచ్చితంగా వేసుకోవాలని ఇస్లాంలో లేదని కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. హిజాబ్ లు వేసుకుని విద్యాసంస్థల్లో వస్తామని ముస్లీం అమ్మాయిలు చెప్పడం సరికదాని కర్ణాటక హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. హిజాబ్ లు వేసుకోవాలని పట్టుపట్టకూడదని కర్ణాటక హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది.

 మతపరమైన దుస్తులు వద్దు

మతపరమైన దుస్తులు వద్దు


హిజాబ్ లు వేసుకునే విషయం పట్టుబట్టి హైకోర్టును ఆశ్రయించిన అమ్మాయిలకు ఎదురు దెబ్బ తగిలింది. ప్రభుత్వం సూచించిన యూనీఫామ్ వేసుకుని విద్యాసంస్థలకు వెళ్లాలని, హిజాబ్ లు, కాషాయకండవాలతో పాటు మతపరమైన దస్తులు దరించి విద్యాసంస్థల్లో అడుగుపెట్టడానికి అవకాశం లేదని కర్ణాటక హైకోర్టు తీర్పు చెప్పింది.

 అందరి వాదనలు విన్న హైకోర్టు

అందరి వాదనలు విన్న హైకోర్టు

హిజాబ్ వివాదంపై దాఖలు అయిన పిటిషన్లను కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రీతురాజ్ అవస్తి, జస్టిస్ కృఫ్ణ ఎస్. దీక్షిత్, జస్టిస్ ఖాజీ జైబున్నీసా మోహిద్దీన్ నేతృత్వంలోని త్రిసభ్య బెంచ్ హిజాబ్ వివాదంపై దాఖలు అయిన అన్ని పిటిషన్లను విచారణ చేసి అందరి వాదనలను విన్నారు. చాలా రోజుల పాటు కర్ణాటక హైకోర్టులో ఇరు వర్గాల వాదనలు వినిపించారు. అన్ని వర్గాల అభిప్రాయాలు తెలుసుకున్న హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం మంగళవారం సంచలన తీర్పు చెప్పింది.

గంటలోనే అమ్మాయిలు రివర్స్

గంటలోనే అమ్మాయిలు రివర్స్

కర్ణాటక హైకోర్టు తీర్పు చెప్పిన గంటలోనే పరీక్షలు రాస్తున్న ముస్లీం విద్యార్థులు పరీక్షా కేంద్రం నుంచి బయటకు వెళ్లిపోయారు. కర్ణాటకలోని యాదగిరి జిల్లాలోని సురపుర తాలుకాలోని కెంబావి ప్రభుత్వ ఇంటర్ కాలేజ్ లో చదువుతున్న ముస్లీం అమ్మాయిలు మంగళవారం పరీక్షలు రాస్తూ మద్యలో పరీక్షలు బహిష్కరించి బయటకు వెళ్లిపోయారు.

 ప్రిన్సిపాల్ చెప్పినా మాట వినలేదు

ప్రిన్సిపాల్ చెప్పినా మాట వినలేదు


హిజాబ్ లు వేసుకోకుండా మేము పరీక్షలు రామయని చెప్పి ఒకేసారి 35 మంది విద్యార్థులు పరీక్షలు బహిష్కరించడం కలకలం రేపింది. పరీక్షలు రాసిన తరువాత బయటకు వెళ్లాలనని తాను ఎంత చెప్పినా విద్యార్థులు మామాట వినలేదని కాలేజ్ ప్రిన్సిపాల్ శకుంతల ఆమెను కలిసిన కన్నడ మీడియాకు చెప్పారు.

పరీక్షలు రాయాలా, వద్దా అని మా ఇంట్లో అడిగి చెబుతాము

పరీక్షలు రాయాలా, వద్దా అని మా ఇంట్లో అడిగి చెబుతాము

హిజాబ్ తీసేసి పరీక్షలు రాయాలా ?, వద్దా ? అనే విషయం మా కుటుంబ సభ్యులను అడిగి చెబుతామని ముస్లీం అమ్మాయిలు పరీక్షలు బహిష్కరించడం హాట్ టాపిక్ అయ్యింది. ఇదే సమయంలో హిజాబ్ తీర్పు తరువాత బెంగళూరు నగరంలో సహ కర్ణాటకలోని అనేక జిల్లాల్లోని విద్యాసంస్థల దగ్గర, పలు ప్రాంతాల్లోని సన్నితమైన ప్రాంతాల్లో కర్ణాటక పోలీసు అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+