Hijab: మాకు అన్యాయం జరిగిందని అర్దరాత్రి గోడల మీద రాసేశారు, హిజాబ్ మా హక్కు అని నినాదాలు !
బెంగళూరు/ఉడిపి: ఉడిపి ప్రభుత్వ కాలేజ్ లోకి హిజాబ్ వేసుకుని అడుగు పెట్టకూడదని కాలేజ్ ప్రిన్సిపాల్, కాలేజ్ అధ్యాపకులు తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ కొంతకాలం క్రితం కొందరు ముస్లీం అమ్మాయిలు కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. మంగళవారం (మార్చి 15వ తేదీ) ఉదయం హిజాబ్ లు దరించే విషయంలో కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. హిజాబ్ అనేది ఇస్లాంలో భాగం కాదని, హిజాబ్ లు కచ్చితంగా వేసుకోవాలని ఇస్లాంలో లేదని కర్ణాటక హైకోర్టు తీర్పు చెప్పింది. కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును ఉడిపి ముస్లీం అమ్మాయిలు సుప్రీం కోర్టులో సవాలు చేశారు. వచ్చే వారం సుప్రీం కోర్టులో హిజాబ్ వివాదంపై దాఖలు అయిన పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఇదే సమయంలో హిజాబ్ వేసుకోవడం మా హక్కు, మాకు అన్యాయం జరిగింది అంటూ కొందరు ఉడిపి జిల్లాలోని గోడల మీద రాతలు రాయడం కలకలం రేపింది. కర్ణాటక బంద్ కు ముస్లీం సంఘాలు పిలుపు ఇచ్చిన రోజే హిజాబ్ కు మద్దతుగా కొందరు గోడల మీద రాతలు రాయడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.

ఎక్కడ మొదలైయ్యిందో మళ్లీ అక్కడే ?
ఉడిపి ప్రభుత్వ కాలేజ్ లోకి హిజాబ్ వేసుకుని అడుగు పెట్టకూడదని కాలేజ్ ప్రిన్సిపాల్, కాలేజ్ అధ్యాపకులు మమ్మల్ని అడ్డుకున్నారని కొంతకాలం క్రితం కొందరు ముస్లీం అమ్మాయిలు ఆరోపించారు. ఉడిపి జిల్లాలో హిజాబ్ వివాదం మొదలు కావడంతో కర్ణాటక వ్యాప్తంగా రచ్చరచ్చ అయ్యింది. హిజాబ్ వివావాదం రాజకీయరంగు పులుముకోవడంతో దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది.

హైకోర్టులో పిటిషన్లు
ఉడిపి జిల్లా కాలేజ్ ప్రిన్సిపాల్ తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ కొంతకాలం క్రితం కొందరు ముస్లీం అమ్మాయిలు కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. మంగళవారం (మార్చి 15వ తేదీ) ఉదయం హిజాబ్ లు దరించే విషయంలో కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. హిజాబ్ అనేది ఇస్లాంలో భాగం కాదని, హిజాబ్ లు కచ్చితంగా వేసుకోవాలని ఇస్లాంలో లేదని కర్ణాటక హైకోర్టు తీర్పు చెప్పింది.

సుప్రీం కోర్టును ఆశ్రయించిన విద్యార్థులు
కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును ఉడిపి ముస్లీం అమ్మాయిలు సుప్రీం కోర్టులో సవాలు చేశారు. కర్ణాటక హైకోర్టులో మాకు అన్యాయం జరిగిందని, అందుకే మేము సుప్రీం కోర్టును ఆశ్రయించామని ఉడిపికి చెందిన కొందరు ముస్లీం అమ్మాయిలు అంటున్నారు. వచ్చే వారం సుప్రీం కోర్టులో హిజాబ్ వివాదంపై దాఖలు అయిన పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది.

హిజాబ్ కు మద్దతుగా గోడల మీద పెయింట్ తో ఎవరు రాశారు ?
హిజాబ్ వేసుకోవడం మా హక్కు, మాకు అన్యాయం జరిగింది అంటూ కొందరు ఉడిపి జిల్లాలోని గోడల మీద రాతలు రాయడం కలకలం రేపింది. కర్ణాటక బంద్ కు ముస్లీం సంఘాలు పిలుపు ఇచ్చిన రోజే హిజాబ్ కు మద్దతుగా కొందరు గోడల మీద రాతలు రాయడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. అర్దరాత్రి దాటిన తరువాత ఓ వర్గం వాళ్లు గోడల మీద హిజాబ్ కు మద్దతుగా రాతలు రాశారని, ఎవరు రాశారో తెలీయడం లేదని స్థానిక పోలీసులు అంటున్నారు. ఉదయం నిద్రలేచిన స్థానికులు హిజాబ్ కు మద్దతుగా గోడల మీద రాతలు ఉన్న విషయం గుర్తించి గుమికూడటంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హిజాబ్ వివాదం కారణంగా ఉడిపి జిల్లాలో 144 సెక్షన్ అమలులో ఉంది.
-
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications