మేం అధికారంలోకి వస్తే ఏం చేస్తామంటే: బీజేపీ విజన్ డాక్యుమెంట్
హిమాచల్ ప్రదేశ్లో తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామనే అంశాలతో కూడిన దార్శనిక పత్రాన్ని బీజేపీ ఆదివారం విడుదల చేసింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ విడుదల చేశారు.
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్లో తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామనే అంశాలతో కూడిన దార్శనిక పత్రాన్ని బీజేపీ ఆదివారం విడుదల చేసింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ విడుదల చేశారు.
విద్యార్థులకు ఉచితంగా లాప్టాప్, టాబ్లెట్లు ఇస్తామని ప్రకటించింది. అన్ని విద్యాసంస్థల్లో ఉచిత వైఫై సదుపాయం కల్పించి, ఒక్కో విద్యార్థికి ఒక జీబీ చొప్పున ఉచితంగా డేటా ఇస్తామని తెలిపింది.
క్లాస్ 3, క్లాస్ 4 ప్రభుత్వ ఉద్యోగాలకు మౌఖిక పరీక్ష, ముఖాముఖిలను రద్దు చేస్తామని తెలిపింది. పేదరిక రేఖకు దిగువన ఉన్న కుటుంబాల విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ వరకు ఉచిత విద్య, జిల్లాస్థాయిలో ఏటా ఉపాధి మేళా నిర్వహణ, 60 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఉచిత చార్ధామ్ యాత్ర వంటి ఇతర అంశాలనూ దానిలో చేర్చింది.
మాఫియా రాజ్యాన్ని అంతం చేయడానికి ముఖ్యమంత్రి కార్యాలయంలో 24 గంటల సహాయవాణిని నెలకొల్పుతామని పేర్కొంది. మాజీ సైనికులతో ఒక కార్యదళాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పింది. ఉద్యోగాలు కల్పిస్తామని, మహిళలకు భద్రత కల్పిస్తామని పేర్కొన్నారు.