ఘోర ప్రమాదం: సిమ్లాలో బస్సు నదిలో పడి 44 మంది మృతి
హిమాచల్ ప్రదేశ్లో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. సిమ్లా జిల్లా నెర్వా సమీపంలోని ఓ ప్రయివేటు బస్సు అదుపు తప్పి నదిలో పడిపోయింది. ఈ ఘటనలో 44 మంది మృతి చెందారు.
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్లో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. సిమ్లా జిల్లా నెర్వా సమీపంలోని ఓ ప్రయివేటు బస్సు అదుపు తప్పి నదిలో పడిపోయింది. ఈ ఘటనలో 44 మంది మృతి చెందారు.
56 మంది ప్రయాణీకులతో ఉత్తరాఖండ్లోని తియునీ ప్రాంతానికి వెళ్తున్న బస్సు సిమ్లాలోని నేర్వా ప్రాంతంలో అదుపు తప్పి టాన్స్ నదిలో పడిపోయిందని పోలీసులు తెలిపారు.
Death toll rises to 45 people after a bus fell into Tons river in Shimla district of Himachal Pradesh pic.twitter.com/EALnNmCy7T
— ANI (@ANI_news) April 19, 2017
సమాచారమందుకున్న రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో 44 మంది మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందన్నారు.












Click it and Unblock the Notifications