అమిత్ షా హిందీ ప్రకటన మరో భాషోద్యమానికి పునాది :కేరళ సీఎం
హిందీని జాతీయ భాషగా చేయాలనే నేపథ్యంలోనే ఒకే దేశం-ఒకే భాష అంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన ట్వీట్తో దక్షిణాది రాష్ట్రాలు భగ్గుమంటుంది. అమిత్ షా ప్రకటనతో ఏకిభవించని తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో తాజాగా కెరళ సీఎం పినరయి విజయన్ సైతం ఆయన ప్రకటనను వ్యతిరేకించాడు.హిందీ మాత్రమే దేశాన్ని ఏకం చేస్తుందనేది తప్పుడు అభిప్రాయమని హితవు పలికారు.
హిందీ భాషా దినోత్సవం సంధర్భంగా కేంద్రమంత్రి అమిత్ షా ఒకే దేశం,ఒకే భాష అంటూ ఆయన ప్రకటన చేయడంతో హిందీని జాతీయ భాషగా చేయాలనే ఆలోచనను ఆయన ప్రకటించాడు. దేశం మొత్తానికి హిందీ బాష ఉండాలని, అదేవిధంగా మెజారీటీ ప్రజలు మాట్లాడే హిందీ భాష దేశం మొత్తాన్ని ఏకం చేస్తుందని ఆయన పేర్కోన్నాడు. ఇలా హిందీ భాషతోనే గాందీ, పటేళ్లు కళలు కన్న ఓకే స్వప్నాన్ని నిజం చేసేందుకు అందరు హిందీ మాట్లాడాల్సిన అవసరం ఉందని అన్నారు.

అమిత్ షా ప్రకటన తర్వాత ముఖ్యంగా దక్షినాదీ రాష్ట్రాల్లోని తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నాయకులు పెద్ద ఎత్తున విమర్శించారు.హిందీ జాతీయ బాష అంటూ అమిత్ షా అబద్దపు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రాంతీయ బాషల హిందీ కూ ఒక బాష అంటూ మండిపడ్డారు.ఇక దక్షిణాది రాష్ట్రాల్లో కీలక రాష్ట్రంగా ఉన్న కేరళ సీఎం సైతం అమిత్ షా ప్రకటనను వ్యతిరేకించారు. అది చేసిన ప్రకటన మరో బాషపరమైన యుద్దానికి దారి తీస్తుందని ఆయన హెచ్చరించారు.












Click it and Unblock the Notifications