అయోధ్య రామయ్య ప్రాణప్రతిష్ట అద్భుత ఘట్టం: సంతోషం మాటల్లో చెప్పలేనన్న ప్రధాని మోడీ!!
500 ఏళ్ల నాటికల ఇప్పుడు సాకారమైంది అయోధ్యలోని రామ మందిరంలో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది . రాముని జన్మస్థలం లో 500 ఏళ్ల తర్వాత అయోధ్య రామయ్య కొలువు తీరారు. అయోధ్య రామయ్య విగ్రహ ప్రాణ ప్రతిష్టకు సంబంధించిన చారిత్రాత్మక ఘట్టం పూర్తయ్యింది. అయోధ్య గర్బాలయంలో బాలరాముడికి ప్రధాని తొలిపూజ చేసి.. దర్శించుకున్నారు.
మోదీతో పండితులు పూజలు చేయించారు. సరిగ్గా 12.29 గంటలకు ప్రారంభమైన ప్రతిష్ఠ 84 సెకెన్ల పాటు జరిగింది. అభిజిత్ లగ్నంలో ఈ క్రతువు నిర్వహించారు. ఈ మహా క్రతువు కాశీకి చెందిన ప్రముఖ వేద ఆచార్య గణేశ్వర్ ద్రవిడ్, ఆచార్య లక్ష్మీకాంత దీక్షిత్ ఆధ్వర్యంలోని 121 మంది వేద పండితులు, రుత్విజుల ఆధ్వర్యంలో జరిగింది. ఈ శుభ సందర్భాన అయోధ్య నగరమంతా రామనామ స్మరణతో మార్మోగిపోయింది.

ఇదిలా ఉంటే ఈ కార్యక్రమంలో విగ్రహ ప్రతిష్టాపన లో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోడీ సోషల్ మీడియా వేదికగా తన సంతోషాన్ని తెలియజేశారు. అయోధ్యలోని రామ మందిరంలోకి ఆయన వెళుతున్న వీడియోను ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ఆయన గుడి లోపలికి మెల్లగా నడుస్తూ రామునికి నైవేద్యాలను తీసుకువెళ్ళిన వీడియోను పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ సోషల్ మీడియా వేదికగా ఈ దైవిక కార్యక్రమంలో భాగమైనందుకు నాకు చాలా ఆనందంగా ఉందని తెలిపారు.
अयोध्या धाम में श्री राम लला की प्राण-प्रतिष्ठा का अलौकिक क्षण हर किसी को भाव-विभोर करने वाला है। इस दिव्य कार्यक्रम का हिस्सा बनना मेरा परम सौभाग्य है। जय सियाराम! https://t.co/GAuJXuB63A
— Narendra Modi (@narendramodi) January 22, 2024
అయోధ్య శ్రీరామ మందిరంలో శ్రీ రామ్ లల్లా జీవితానికి అంకితం చేయబడిన అతీంద్రియ క్షణం ప్రతి ఒక్కరిని భావోద్వేగానికి గురి చేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ దివ్య కార్యక్రమంలో భాగస్వామ్యమైనందుకు చాలా ఆనందంగా ఉందని తెలిపిన ప్రధాని నరేంద్ర మోడీ జై శ్రీరామ్ అంటూ పోస్ట్ చేశారు. మాటల్లో చెప్పలేనంత సంతోషం ఈరోజు కలిగిందని ఆయన తన పోస్టు ద్వారా పేర్కొన్నారు.
మంత్రముగ్ధం రాములోరి రూపం..!#Ayodhya #RamMandirPranPrathistha #JaiShreeRam #AyodhyaRamMandir #జైశ్రీరామ్ #Oneindiatelugu pic.twitter.com/HPBElRvGVo
— oneindiatelugu (@oneindiatelugu) January 22, 2024
ఈ రోజు శ్రీరామ విగ్రహ ప్రాణ ప్రతిష్టలో పాల్గొన్న భారతదేశ ప్రధాని మోడీ ఈ నెల 12వ తేదీ నుండే శ్రీరామ ఉపాసన చేస్తున్నారు. యమ నియమాలని పాటిస్తూ రామునికి మనసును అంకితం చేసి కఠోర నియమాలను ఆచరిస్తున్నారు. అనేక పుణ్య క్షేత్రాలలో రామయ్యను దర్శిస్తూ తన భక్తిని చాటుకున్నారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications