షాకింగ్ వీడియో : ఛత్తీస్ ఘడ్ లో భయానకం- భక్తులపై దూసుకెళ్లిన కారు-తీవ్ర ఉద్రిక్తత
ఛత్తీస్ ఘడ్ లో ఇవాళ ఓ ఘోర విషాదం చోటు చేసుకుంది. దసరా సంబరాల్లో జనం మునిగితేలుతున్న వేళ జష్ పూర్ లో భక్తులపై కారు దూసుకెళ్లిన ఘటనలో ఒకరు చనిపోగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో దృశ్యాలు భయానకంగా ఉన్నాయి. దీంతో వీడియో చూసిన వారంతా షాకవుతున్నారు.
ఛత్తీస్గఢ్లోని జష్పూర్లో ఉన్న పఠల్గావ్లో దసరా సందర్భంగా దుర్గా విగ్రహ నిమజ్జన ఊరేగింపులో ఇరవై మంది పాల్గొంటున్నారు. రోడ్లపై వీరు వెళ్తుండగా.. అతివేగంగా వచ్చిన ఎస్యూవీ వీరిని ఢీకొనడంతో ఒకరు మరణించారు. ఈ ఘటన జరిగిన తీరు అత్యంత భయానకంగా ఉంది. దీంతో వీటి వీడియో దృశ్యాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు గాయపడిన 17 మందిని రెండు ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఈ ఘటనలో ఒకరు మరణించినట్లు జాష్పూర్ పోలీసు సూపరింటెండెంట్ విజయ్ అగర్వాల్ ధృవీకరించారు. మరో 16 మందిని గాయాలతో ఆసుపత్రికి తరలించారు. వారిలో ఇద్దరు ఫ్రాక్చర్కు గురైనట్లు ఎక్స్రేలు నిర్ధారించడంతో వారిలో ఇతర ఆసుపత్రులకు రెఫర్ చేసినట్లు బ్లాక్ మెడికల్ ఆఫీసర్ జేమ్స్ మింజ్ తెలిపారు. ఈ సంఘటన తర్వాత ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది, ఆగ్రహించిన స్థానికులు అనేక వాహనాలకు నిప్పు పెట్టారు. కారు డ్రైవర్ని కూడా కొట్టారు. స్థానికులు పఠల్గావ్ పోలీస్ స్టేషన్కు వెళ్లి ఏమి జరిగిందో నిరసన తెలిపారు. సంబంధిత వాహనం గంజాయితో నింపబడిందని వారు ఆరోపించారు. అయితే, ఈ విషయంపై ఇంకా విచారణ జరగాల్సి ఉందని అధికారులు తెలిపారు. ఈ కేసులో ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు ఘటనపై దర్యాప్తు జరుపుతున్నారు.
Scary visuals from Jashpur in Chattisgarh where a speeding SUV rammed into people on the road during the procession of Durga Visarjan. Casualties have been reported. One person has died while 20 are injured. Four people reportedly are critical. pic.twitter.com/iPTlsuWc3Y
— Aditya Raj Kaul (@AdityaRajKaul) October 15, 2021