బెంగళూర్లో డ్రగ్ కొరత.. రూ.10 వేలు ఇస్తానంటోన్న రోగి..
కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. నియంత్రణ కోసం కర్ప్యూ.. 144 సెక్షన్ విధిస్తున్నారు. అయితే వైరస్ రాకుండా ఉండేందుకు వ్యాక్సిన్ తీసుకోవడం కంపల్సరీ అవుతోంది. 45 ఏళ్ల వరకు అనారోగ్యం.. ఆరోగ్యంగా ఉన్నాసరే వ్యాక్సిన్ అందజేస్తున్నారు. అయితే ఐటీ హబ్ బెంగళూరులో మాత్రం ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడికి చెందిన అప్తాబ్ అనే వ్యక్తి వ్యాక్సిన్ తీసుకునేందుకు చాలా ఇబ్బంది పడ్డారు. వ్యాక్సిన్ కోసం సంతోష్ ఆస్పత్రిలో ఆప్తాబ్ చేరాడు.. కానీ అక్కడ వ్యాక్సిన్ మాత్రం దొరకలేదు. వ్యాక్సిన్ తీసుకోవాలని అతనినే యాజమాన్యం కోరడం విశేషం.
ఆప్తాబ్ను ఇండియా టుడే సంప్రదించగా.. తనకు వ్యాక్సిన్ కావాలని రూ.10 వేలు కూడా ఇస్తానని చెప్పారు. ఆస్పత్రుల్లో 578 రామ్ డెసివర్ మాత్రమే ఉన్నాయి. కానీ 12 వేల డోసులు కావాల్సి ఉంది. వ్యాక్సిన్ కనుక్కొవడం స్థానికులకు మరింత ఇబ్బందిగా మారింది. రామ్ డెసివర్ వ్యాక్సిన్ కోసం బెంగళూరులో చాలా డిమాండ్ ఉంది. తనకు రోజుకు 15 నుంచి ఇరవై విన్నపాలు వస్తున్నాయని ఒకతను చెప్పాడు. అంతేకాదు బీదర్, రాయ్ చూర్ నుంచి డ్రగ్ కోసం రిక్వెస్ట్ వచ్చాయని తెలిపారు.
గత 3 నుంచి 4 రోజుల నుంచి పరిస్థితి ఇలానే ఉంది అని వైద్యులు చెబుతున్నారు. కానీ బెంగళూరులోనే సరైన డ్రగ్ అందుబాటులో లేదని వివరించారు. డ్రగ్ కోసం రాష్ట్ర ప్రభుత్వం సమీక్ష కూడా నిర్వహించింది. సువర్ణ సురక్ష ట్రస్ట్ ద్వారా రోగులకు వ్యాక్సిన్ కావాలని రిక్వెస్ట్ వస్తే ప్రైవేట్ ఆస్పత్రులకు అందజేస్తారు. ఒక్కొక్కరికీ ఆరు డోసులు ఇంజెక్షన్ ఇస్తారు. తొలుత రెండురోజులు.. తర్వాత నాలుగురోజుల తర్వాత వ్యాక్సిన్ ఇస్తారు. ఇది ఇలా ఉంటే కర్ణాటక ఆరోగ్య మంత్రి అంతా బానే ఉంది అని చెబుతున్నారు.