తల్లి రూప రాక్షసి: 15 నెలల పసికందును కాలితో తన్ని, గొంతునులిమిన కసాయి.. సీసీటీవీ ఫుటేజీ చూసి..
ఏం జరుగుతుందో తెలియడం లేదు. కాల ప్రభావమో ఏమో కానీ.. మంచి, మర్యాద కాదు కదా.. ప్రేమ, ఆప్యాయతలు అంటే తెలియని పరిస్థితి నెలకొంది. కొన్నిచోట్ల జరుగుతోన్న అమానుష ఘటనలు ఇందుకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోన్నాయి. ఒడిశాలో ఓ తల్లి వికృతంగా ప్రవర్తించింది. తన పేగు తెంచుకొని పుట్టిన బిడ్డ పట్ల జాలీ, దయ లేకుండా ప్రవర్తించిన తీరు ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

సీసీటీవీ కెమెరా ఏర్పాటు..
ఒడిశా పూరీ జిల్లా గోప్ ప్రాంతంతో భార్యభర్తలు నివసిస్తున్నారు. వీరితో భర్త.. అమ్మ, నాన్న కూడా ఉంటున్నారు. దంపతులకు 15 నెలల బాబు కూడా ఉన్నారు. అయితే భార్య ఊరికే గొడవ పడుతోంది.. తాను ఉన్నప్పుడే ఇలా చేస్తే.. లేనప్పుడు ఎలా ప్రవర్తిస్తుందో చూడాలని అనుకున్నాడు. ఆమెకి తెలియకుండా సీసీటీవీ కెమెరాలు బిగించాడు. ఎప్పటిలాగే తాను ఆఫీసుకు వెళ్లిపోయాడు. తర్వాత ఫుటేజీ చూసి.. నోరెళ్లబెట్టాడు.

వీడియో చూసి షాక్..
తన భార్య ఇలా ప్రవర్తిస్తోందా అని షాక్ తిన్నాడు. తన కొడుకును కాలితో తన్నడం చూసి ఖంగు తిన్నాడు. వామ్మో అంటూ ఆ వీడియోను సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేశాడు. తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన పిల్లాడినే కాదు.. తల్లిదండ్రులతో కూడా మంచిగా ప్రవర్తించదని పేర్కొన్నారు. వారిని టార్చర్ చేస్తుందని కంప్లైంట్లో వివరించారు.

ఎందుకు అలా చేశానంటే.. భార్య వివరణ
భర్త ఆరోపణలు.. ఇలా ఉండగా.. భార్య మాత్రం అదేం కాదు అని చెబుతోంది. తనను అత్తమామలు వేధిస్తున్నారని కొత్త వాదనను తెరపైకి తీసుకొచ్చారు. వారితో విసిగి వేగలేక.. సమయానికి అన్నం కూడా తినలేకపోతున్నానని చెప్పారు. ఆకలికి తట్టుకోలేక.. తన కుమారుడిపై కోపం చూపిస్తున్నానని వివరించారు. భార్య భర్తల ఫిర్యాదు తీసుకున్న పోలీసులు.. విచారణ జరిపిస్తున్నారు.

దుమ్మెత్తిపోసిన నెటిజన్లు
భార్య చెప్పిన దానిలో నిజం ఉన్నా.. కన్న కొడుకును.. అదీ పసికందుపై చేయిచేసుకోవడం మాత్రం దారుణం. వీడియో చూసిన నెటిజన్లు మహిళను దుమ్మెత్తి పోస్తున్నారు. ఇదేం పద్ధతి అంటూ చీవాట్లు పెడుతున్నారు. తీరు మార్చుకోవాలని.. భావి తరాలకు ఎలాంటి సందేశం ఇస్తున్నారని విమర్శించారు.
-
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..!












Click it and Unblock the Notifications