భార్యపై అనుమానం.. తల నరికి ఆమె సోదరుడికి చూపించాడు..
శనివారం రాత్రి ఆమెను కడతేర్చాలని నిర్ణయించుకున్నాడు. రాత్రికి ఇంటికి వచ్చాక.. అందరు నిద్రపోతున్న సమయంలో.. గొడ్డలితో భార్య తల నరికేశాడు.
తిరుపతి: మనసులో ఒకసారి అనుమానం మొదలైందంటే.. ఒక్క క్షణం కూడా ఆ మనిషి కుదురుగా ఉండలేడు. అనుమానాన్ని నివృత్తి చేసుకోవాల్సింది పోయి.. కక్ష సాధింపు ధోరణితో వెళ్లాలని ప్రయత్నిస్తే.. చివరికి నేరస్తుడిగానే తయారవుతాడు.
భార్యపై అనుమానం పెంచుకున్న ఓ భర్త ఆమెను కడతేర్చిన ఘటన తాజాగా తిరుపతిలో చోటు చేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న మునస్వామి అనే వ్యక్తి తన భార్య చిత్రపై విపరీతమైన అనుమానం పెంచుకున్నాడు.

మునస్వామి స్వస్థలం తమిళనాడులోని సేలం కాగా.. బతుకుదెరువు కోసం తమిళనాడుకు వచ్చి స్థిరపడ్డాడు. ఇదే క్రమంలో తమిళనాడుకు చెందిన చిత్రతో తొమ్మిదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు కూడా ఉన్నారు.
అయితే గతకొంతకాలంగా భార్యపై అనుమానం పెంచుకున్న భర్త.. శనివారం రాత్రి ఆమెను కడతేర్చాలని నిర్ణయించుకున్నాడు. రాత్రికి ఇంటికి వచ్చాక.. అందరు నిద్రపోతున్న సమయంలో.. గొడ్డలితో భార్య తల నరికేశాడు.
అనంతరం పక్కింట్లోనే నివాసముంటున్న చిత్ర సోదరుడిని నిద్రలోంచి లేపి మరీ.. చిత్ర తలను చూపించాడు. చిత్ర సోదరుడు షాక్ నుంచి తేరుకునే లోపే.. అక్కడినుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. ప్రస్తుతం మునస్వామి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications