తీర్పుపై జయలలిత స్పందన, ముందస్తుకు వెళ్తారా?: ట్విట్టర్లో ఆగ్రహం
చెన్నై: రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టులో తనకు అనుకూలంగా వచ్చిన తీర్పు పైన అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత సోమవారం స్పందించారు. ఇది తన వ్యక్తిగత విజయంగా భావించడం లేదని చెప్పారు. ఎప్పటికైనా ధర్మం గెలుస్తుందన్నారు.
రాజకీయ కుట్రతోనే తన పైన తప్పుడు ఆరోపణలు చేశారని ఆమె చెప్పారు. ఎన్ని కుట్రలు చేసినా చివరకు ధర్మమే గెలిచిందనే విషయం అందరు గుర్తించాలని ప్రకటించారు. కర్నాటక హైకోర్టు తీర్పు తమిళుల నమ్మకానికి దక్కిన విజయమని ఆమె తన ప్రకటనలో పేర్కొన్నారు.
జయలలిత ముందస్తు వ్యూహం?

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కర్నాటక హైకోర్టు జయలలితను నిర్దోషిగా ప్రకటించిన నేపథ్యంలో.. తమిళనాడ రాజకీయం వేడెక్కింది. వచ్చే ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. అయితే, ముందస్తు ఎన్నికలకు వెళ్లే అంశంపై చర్చ సాగుతోంది. జయలలిత నిర్దోషిగా తేలడంతో ప్రజల్లో సానుకూలత వ్యక్తమయిందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే, ముందస్తు నిర్ణయం జయలలితకే వదిలేశారు.
తీర్పుపై ట్విట్టర్లో విమర్శలు
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయలలితను నిర్దోషిగా తేల్చిన కోర్టు తీర్పుపై ట్విట్టర్లో విమర్శల వర్షం కురిసింది. ఆమెను నిర్దోషి అనడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరికొందరు మమ్మీ రిటర్న్స్ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ధనికులు శిక్షల నుండి తప్పించుకోవచ్చని మరోసారి రుజువైందన్నారు.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications