జయలలితకు నేను చికిత్స చెయ్యలేదు: డాక్టర్ స్వామినాథన్: అసలు ఏం జరిగింది?
Recommended Video

చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత అనుమానాస్పద మృతి విషయంపై విచారణ చేస్తున్న మద్రాసు హై కోర్టు రిటైడ్ న్యాయమూర్తి జస్టిస్ ఆర్ముగస్వామి విచారణ కమిషన్ ప్రతి విషయం బయటకు లాగుతోంది. జయలలితకు ఎవరెవరు చికిత్స చేశారు అనే పూర్తి సమాచారం సేకరిస్తున్నారు. ప్రముఖ వైద్యుడు డాక్టర్ స్వామినాథన్ జయలలితకు చికిత్స చెయ్యలేదని విచారణలో వెలుగు చూసింది.

జయలలిత
డాక్టర్ స్వామినాథన్ ప్రముఖ కార్డియాలజిస్ట్. జయలలిత 75 రోజుల పాటు ఆసుపత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందిన విషయం తెలిసిందే. అయితే డిసెంబర్ 5వ తేదీ రాత్రి జయలలితకు గుండెపోటు రావడంతో మరణించారని అపోలో ఆసుపత్రి ప్రకటించింది.

డాక్టర్ స్వామినాథన్
తమిళనాడులో ప్రముఖ కార్డియాలజిస్ట్ అయిన డాక్టర్ స్వామినాథన్ జయలలితకు చికిత్స చేశారని, అయితే చికిత్స విఫలం అయ్యి అమ్మ మరణించారని ఇప్పటి వరకూ ప్రచారం జరిగింది. డాక్టర్ స్వామినాథన్ చికిత్స చేశారు అనే ప్రచారం ఎంతో వరకు నిజం అనే విషయం వెలుగు చూడలేదు.

డాక్టర్ కు సమన్లు
జయలలిత అనుమానాస్పద మృతి కేసు విచారణ చేస్తున్న మద్రాసు హై కోర్టు రిటైడ్ న్యాయమూర్తి జస్టిస్ ఆర్ముగస్వామి విచారణ కమిషన్ ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ స్వామినాథన్ ను విచారణకు హాజరుకావాలని సమన్లు జారీ చేసింది.

ఆ చాన్స్ ఇవ్వలేదు!
జయలలితకు చికిత్స చెయ్యడానికి తనకు అనుమతి ఇవ్వలేదని, అసలు ఆమెను తాను ఆసుపత్రిలో చూడనేలేదని ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ స్వామినాథన్ జస్టిస్ ఆర్ముగస్వామి విచారణ కమిషన్ ముందు వివరణ ఇచ్చారు.

అదే అనుమానం
ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ స్వామినాథన్ తో జయలలితకు ఎందుకు చికిత్స చేయించలేదు ? అసలు ఏమి జరిగింది, అమ్మకు చికిత్స చేసే సమయంలో శశికళ, ఆమె కుటుంబ సభ్యులు నిర్లక్షం చేశారా ? అనే కోణంలో ఇప్పుడు విచారణ ముమ్మరం అయ్యింది.
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications