'పాకిస్తాన్ జిందాబాద్ అన్నారు, తుది శ్వాస వరకు దేశసేవ'
తన తుది శ్వాస విడిచే వరకు దేశానికి సేవ చేస్తానని జవాన్ విక్కీ విశ్వకర్మ తెలిపారు. ఇటీవల జమ్ము కాశ్మీర్లో స్థానిక యువత దాడి చేసినా మౌనంగా భరిస్తూ తన విధులు నిర్వర్తించి అందరి మనసు గెలుచుకున్నారు.
న్యూఢిల్లీ: తన తుది శ్వాస విడిచే వరకు దేశానికి సేవ చేస్తానని జవాన్ విక్కీ విశ్వకర్మ తెలిపారు. ఇటీవల జమ్ము కాశ్మీర్లో స్థానిక యువత దాడి చేసినా మౌనంగా భరిస్తూ తన విధులు నిర్వర్తించి అందరి మనసు గెలుచుకున్నారు.
ఇటీవల ఆయన సెలవులపై స్వగ్రామానికి వచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడారు. తాను రాళ్లు రువ్వే వారిని చూసి భయపడనని, అక్కడి వారు పాకిస్థాన్ జిందాబాద్, గో ఇండియా-గో బ్యాక్ అని నినాదాలు చేస్తూ రెచ్చగొడుతున్నా నిగ్రహంతో ఉన్నానని చెప్పారు.

అది చాలా సున్నితమైన ప్రదేశమని, దేశ క్షేమం కోసం ఆ సమయంలో స్పందించలేదన్నారు. తన విధులను తాను సక్రమంగా నిర్వర్తించాలనుకున్నానని, మమ్మల్ని మేము రక్షించుకుంటూ దేశ ప్రయోజనాలు ఏవిధంగా కాపాడాలో శిక్షణలో బాగా నేర్పించారని చెప్పారు. అందుకే ఆ సమయంలో మౌనంగా ఉన్నానని చెప్పారు.
దీనిపై విశ్వకర్మ తల్లి కూడా స్పందించారు. తన కుమారుడిని సరిహద్దుల్లో విధులకు వేశారంటే తొలుత భయపడ్డానని పేర్కొన్నారు. కానీ అతను విధులు నిర్వహించిన తీరు చూసి గర్వపడుతున్నట్లు పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా తన కుమారుడు దేశానికి సేవ చేస్తారన్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications