వివాహేతర సంబందం:వ్యక్తి హత్య, 16 ముక్కలుగా కోసి ఫ్రిజ్ లో ఇలా, చివరికిలా....
వివాహేతర సంబంధం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకొంది. భార్య ఉన్నప్పటికీ , మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగించిన ఎయిర్ ఫోర్స్ ఉద్యోగిని హత్య చేసి శరీరభాగాలను 16 ముక్కలుగా కోశాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్
ఉత్తర్ ప్రదేశ్:వివాహేతర సంబంధం ఓ నిండుప్రాణాన్ని బలితీసుకొంది. భార్య ఉన్నా మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగించిన వ్యక్తి చివరికి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకొంది.
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని 27 ఏళ్ళ విపిన్ శుక్లా పంజాబ్ భటిండా సమీపంలోని ఎయిర్ బేస్ లో విధులునిర్వహిస్తున్నాడు.ఆలనాకా యూపీకి చెందిన సార్టెంజ్ సురేష్ కుమార్ భార్య అనురాధ పటేల్ తో పరిచయం ఏర్పడింది.
విపిన్ శుక్లా ఎయిర్ బేస్ లోని క్యాంటీన్ లో కూడ కీలకంగా వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలోనే అనురాధ పటేల్ తో విపిన్ శుక్లాకు పరిచయం ఏర్పడింది.ఈ పరిచయం కాస్తా వివాహేతర సంబందానికి దారితీసింది.
అనురాధ పటేల్ గర్భం దాల్చింది.దీంతో తనను వివాహం చేసుకోవాలని అనురాధ పటేల్ విపిన్ శుక్లాను కోరింది. అయితే అప్పటికే విపిన్ శుక్లాకు వివాహమైంది. దీంతో ఆయన వివాహం చేసుకోవడానికి ఇష్టపడలేదు.
అనురాధ పటేల్ తో విపిన్ శుక్లాకు వివాహేతర సంబంధం ఉన్న విషయం భర్త సురేష్ కు తెలిసింది.దీంతో విపిన్ శుక్లాను హత్య చేయాలని సురేష్ నిర్ణయం తీసుకొన్నాడు. ఈ మేరకు పథకం ప్రకారం వ్యవహరించాడు.
క్వార్టర్ మారుతున్నానంటూ ఫోన్ చేసి విపిన్ శుక్లాను రమ్మని సురేష్ ఫోన్ చేశాడు. క్వార్టర్ కు వచ్చిన శుక్లాను సురేష్ హత్య చేశాడు. బావ, భార్య సహకారంతో విపిన్ శుక్లాను ఈ నెల 8వ, తేదిన హత్య చేశాడు.
ఈ మృతదేహన్ని పెట్టెలో పెట్టి మరో క్వార్టర్ కు మారాడు. అయితే విపిన్ మృతదేహన్ని 16 ముక్కలుగా ఈ నెల 16వ, తేదిన నరికాడు.ఈ శరీరభాగాలను పాలిథిన్ కవర్లలో పెట్టి ఫ్రిజ్ లో మరికొన్నింటిని ఆల్మారాలో దాచాడు. ఈ ఘటన ఈ నెల 8వ, తేదిన జరిగింది.అయితే మృతదేహల బాగాలు మాత్రం మంగళవారం నాడు వెలుగుచూశాయి.
విపిన్ శుక్లా భార్య ఫిర్యాదుతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు డాగ్ స్క్వాడ్ సహయంతో పోలీసులు మృతదేహన్ని గుర్తించారు. సురేష్ కుమార్ అతని భార్య అనురాధ పటేల్ ను పోలీసులు అరెస్టు చేశారు. సురేష్ కుమార్ బావ శశిభూషణ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.