ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానం కూలిపోతే, సెల్ఫీలు తీసుకున్నారు
న్యూఢిల్లీ: ఉత్తర ప్రదేశ్లోని భాగ్పట్లో ఓ ఏఐఎఫ్ విమానం కూలితే స్థానికులు పలువురు ఆ ప్రమాదం జరిగిన చోటుకు వెళ్లి సెల్ఫీలు తీసుకున్నారు.
ఘజియాబాద్లోని హిందన్ ఎయిర్ బేస్ నుంచి బయలు దేరిన వైమానిక దళానికి చెందిన ఎయిర్ క్రాఫ్ట్ శుక్రవారం కూలింది. ప్రమాదం జరిగినప్పుడు అందులో ప్రయాణించిన ముగ్గురు వ్యక్తులు సురక్షితంగా బయటపడ్డారు.
అయితే స్థానికులు కొందరు మాత్రం ప్రమాద స్థలం వద్ద అత్యుత్సాహం ప్రదర్శించారు. వెనక ఎయిర్ క్రాఫ్ట్ వచ్చేలా సెల్ఫీలు తీసుకోవడానికి ఉత్సాహం కనబరిచారు. ఆనందంగా, నవ్వుతూ ఫొటోలు తీసుకున్నారు.
మరోవైపు, ఇది కూలిపోవడానికి గల కారణాలు తెలియరాలేదు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. సెప్టెంబర్ 4న మిగ 27 జెట్ ఫైటర్ సాంకేతిక లోపంతో రాజస్థాన్లోని జోధ్పూర్ దగ్గర్లలో కూలిపోయింది. జూన్లో కూడా మిగ్ 21 ఫైటర్ విమానం హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రా ప్రాంతంలో కూలింది.