వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రతీకార దాడులు: సరిహద్దు దాటిన వైమానిక దళం..ఉగ్ర శిబిరాలు ఛిన్నాభిన్నం

|
Google Oneindia TeluguNews

Recommended Video

పాక్ ఉగ్ర శిబిరాలపై... విరుచుకుపడ్డ భారత వైమానిక దళం !! | Oneindia Telugu

శ్రీనగర్‌‌: ఊహించిందే చోటు చేసుకుంది. ఉగ్రవాదులు, ఉగ్రవాద సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవడానికి కొంత గడువు కావాలని పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ చేసిన వినతిని కేంద్ర ప్రభుత్వం నిర్ద్వంద్వంగా తోసి పుచ్చింది. ఉరుము లేని పిడుగులాగా ఉగ్రవాదుల శిబిరాలపై విరుచుకు పడింది. భారత్-పాకిస్తాన్ సరిహద్దుల్లో వాస్తవాధీన రేఖ వెంబడి ఉన్న, ఏళ్ల తరబడి కొనసాగుతున్నట్లుగా భావిస్తున్న ఉగ్రవాద శిబిరాలపై మనదేశ వైమానిక దళం మెరుపుదాడులకు దిగింది. మంగళవారం తెల్లవారు జామున 3:30 గంటలకు ఈ దాడులు ఆరంభం అయ్యాయి.

IAF strikes on terror camps in Pakistan border caused casualties estimated at 200-300

తురుఫుముక్కతో దాడి..

వైమానిక దళం తురుపుముక్కగా భావించే మిరాజ్ యుద్ధ విమానాలను వైమానిక దళ అధికారులు రంగంలో దించారు. 250కి పైగా జెట్ ఫైటర్లతో దాడి చేశారు. ఉగ్రవాద శిబిరాలపై సుమారు 1200 కేజీల పేలుడు పదార్థాలను జార విడిచారు. ఈ దాడులను రెండు దేశాల రక్షణ దళాలు ధృవీకరించాయి. తాము చేసిన దాడులు వందశాతం విజయవంతం అయ్యాయని వైమానిక దళ అధికారి ఒకరు ధృవీకరించారు. భారత వైమానిక దళం దాడులు చేసిన విషయం నిజమేనంటూ పాక్ ఆర్మీ కూడా నిర్ధారించింది. వ్యూహం ప్రకారం తాము చేసిన దాడులు లక్ష్యాన్ని చేరుకున్నాయని భారత అధికారులు తెలిపారు. వాస్తవాధీన రేఖ వెంబడి ఉన్న బాలాకోట్‌, ఛకోటీ, ముఝ్రాబాద్ లో ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం అయ్యాయి.

ప్రతీకార దాడులు

జమ్మూకాశ్మీర్ లోని పుల్వామా జిల్లా అవంతిపురా వద్ద ఈ నెల 14వ తేదీన చోటు చేసుకున్న ఉగ్రదాడి తరువాత భారత్ ఈ స్థాయిలో ప్రతీకారానికి దిగడం ఇదే తొలిసారి. పుల్వామా దాడి చోటు చేసుకున్న కొద్దిరోజుల్లోనే భారత వైమానిక దళం రాజస్థాన్ లోని పాకిస్తాన్ సరిహద్దుల్లో తన బలాన్ని ప్రదర్శించింది. వైమానిక విన్యాసాలను చేపట్టింది. దాడులు తప్పవని వైమానిక దళం చెప్పకనే చెప్పినట్టయింది. సరిగ్గా 12 రోజుల్లో పాక్‌ ఉగ్రశిబిరాలపై భారత్‌ ప్రతీకారానికి దిగింది.

English summary
NEW DELHI: India carried out pre-dawn air strikes on terror camps across the Line of Control on Tuesday, according to reports. At around 3:30 this morning, 12 Mirage 2000 fighter jets of the Indian Air Force dropped 1,000 kg bombs on terror camps of the Jaish-e-Mohammed, completely destroying them, news agency ANI reported quoting Air Force sources. "100 per cent successful" and went on "exactly as planned". Prime Minister Narendra Modi is meeting with top ministers in the cabinet committee on security at his home in Delhi to take stock of the situation. Terror launch pads in Balakot, Chakothi and Muzaffrabad across the Line of Control were destroyed by the laser-guided bombs and so were the control rooms of the Jaish.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X