ఐఏఎస్లు మౌఖిక ఆదేశాలను వినొద్దు: సుప్రీంకోర్టు

అధికారుల బదిలీలు, పోస్టింగ్ ఇవ్వడంలో అవినీతి, లంచగొండితనం, రాజకీయ జోక్యానికి వ్యతిరేకంగా సివిల్ సర్వీసెస్ బోర్డు ఏర్పాటు చేయాలని కోరుతూ ఓ పిటిషన్ దాఖలైంది. పిటిషన్ను పరిశీలించిన సుప్రీంకోర్టు అలాంటి ఒక బోర్డును మూడు నెలల్లోగా ఏర్పాటు చేయాలని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. అధికారులు స్థిరమైన కాల పరిమితులను కలిగి ఉండాలని పేర్కొంది.
తరచూ అధికారులను బదిలీ చేయడాన్ని నిరోధించడం వల్ల ప్రభుత్వ విధానాల అమలు, ప్రభుత్వ పథకాలను పేద ప్రజలకు అందించేందుకు వీలవుతుందని తెలిపింది. ఈ సంస్కరణల కారణంగా ప్రభుత్వం, ఉన్నతాధికారుల మధ్య వృత్తి పరమైన విధానాలను మెరుగుపర్చడం సాధ్యమవుతుందని పేర్కొంది. ఐఏఎస్ అధికారుల బదిలీలు, పోస్టింగ్, క్రమశిక్షణ పరమైన చర్యలను నియంత్రించేందుకు ఓ చట్టాన్ని రూపొందించాలని సుప్రీం కోర్టు పార్లమెంటును కోరింది.
అధికారులు ప్రభుత్వ అధిపతుల మౌఖిక ఆదేశాలతో స్పందించకూడదని, అలాంటి ఆదేశాలు అవినీతిని పెంచే విధంగా ఉంటాయని కోర్టు తీర్పులో పేర్కొంది. ఒక వేళ ఐఏఎస్ అధికారులు వారి మౌఖిక ఆదేశాలతో స్పందించినట్లయితే వాటిని నమోదు చేయాలని, లేదంటే సమాచార హక్కు చట్టం తెచ్చి కూడా వృథాయే అవుతుందని కోర్టు పేర్కొంది.
సుప్రీం కోర్టు ఓ మైలురాయి లాంటి తీర్పును వెలువరించిందని మాజీ కేబినెట్ కార్యదర్శి టిఎస్ఆర్ సుబ్రమణ్యన్ అన్నారు. ఐఏఎస్ అధికారులు ప్రజా సేవకులు మాత్రమేనని, ప్రైవేటు సేవకులు కాదని, ప్రభుత్వం వారిని స్వప్రయోజనాల కోసం ఉపయోగించకూడదని ఆయన అన్నారు. ఇటీవలి కాలంలో ఉత్తరప్రదేశ్లో దుర్గాశక్తి నాగ్పాల్, హర్యానా రాష్ట్రంలోని అశోక్ ఖేమ్కా లాంటి ఐఏఎస్ అధికారుల విషయంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరించిన తీరు పట్ల ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చిన విషయం తెలిసిందె.
-
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ?












Click it and Unblock the Notifications