Congress: ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు కూడా EWS రిజర్వేషన్..
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రోహిత్ చట్టం తెచ్చి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు అండగా నిలుస్తామని కాంగ్రెస్ తెలిపింది.
విద్యా సంస్థల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ వర్గాల విద్యార్థులు ఎదుర్కొంటున్న వివక్షను పరిష్కరించడానికి "రోహిత్ వేముల చట్టం" అనే ప్రత్యేక చట్టాన్ని తీసుకువస్తామని కాంగ్రెస్ ఆదివారం హామీ ఇచ్చింది. కాంగ్రెస్ లౌకికవాదానికి కట్టుబడి ఉంటుందని నొక్కి చెప్పింది. సమాజంలోని ఆర్థికంగా బలహీన వర్గాలకు (EWS) రిజర్వేషన్లు కల్పించాలని తాము వాదించామని, అయితే EWS కోటాపై BJP విధానం పేద SC, ST, OBC కూడా EWS కోటా కింద ప్రయోజనాలను పొందకుండా మినహాయించిందని పార్టీ పేర్కొంది.

వయో సడలింపు
అన్ని వర్గాలకు చెందిన పేదలు ఆర్థికంగా బలహీనంగా ఉన్నారని, అందువల్ల పేద ఎస్సీలు, ఎస్టీలు, OBCలను EWS కోటా నుండి మినహాయించలేమని కాంగ్రెస్ పేర్కొంది.ఆర్థికంగా వెనుకబడిన వర్గాల విద్యార్థులకు ప్రభుత్వ సర్వీసుల్లో ప్రవేశించేందుకు ఎస్సీ, ఎస్టీలకు వయో సడలింపుతో సమానంగా వయోపరిమితిలో సడలింపు ఉండేలా కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తుందని తీర్మానంలో వివరించింది.

కుల గణన
కుల గణన చేయాలని డిమాండ్ను చేసింది. సామాజిక-ఆర్థిక విద్యాపరమైన వెనుకబాటుకు బెంచ్మార్క్ను సవరించడానికి కీలకమైన కుల గణనను నిర్వహించడానికి బీజేపీ వెనకాడుతుందని విమర్శించింది. "భారత జాతీయ కాంగ్రెస్ దశవార్షిక జనాభా గణనతో పాటు సామాజిక-ఆర్థిక కుల గణనను నిర్వహించడానికి కట్టుబడి ఉంది. కుల గణన డి-నోటిఫైడ్ తెగలు మరియు సంచార జాతులను కూడా లెక్కించాలి, "అని తీర్మానం పేర్కొంది.

మంత్రిత్వ శాఖ
OBCల సాధికారత కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను రూపొందించడానికి కూడా కాంగ్రెస్ కట్టుబడి ఉందని తెలిపింది. ఇది OBCల విద్యా, ఉద్యోగ అవకాశాలను విస్తరించడం, వారి నివాసాలలో పౌర సౌకర్యాల ఏర్పాటుపై దృష్టి సారిస్తుందని పేర్కొంది. సమాజంలోని అట్టడుగు వర్గాల్లో తన మద్దతు స్థావరాన్ని తిరిగి స్థాపించడానికి మరియు బలోపేతం చేయడానికి కాంగ్రెస్ కృషి చేస్తుందని స్పష్టం చేసింది.

మూకదాడులు
"ముఖ్యంగా మైనారిటీలపై మూకదాడులు, ఎస్సీలు, ఎస్టీలపై అఘాయిత్యాలు, మహిళలపై హింస గత తొమ్మిదేళ్లలో రికార్డు స్థాయికి చేరుకుంది. ఈ వర్గాలు/ సమూహాలలో అభద్రతా భావం, వేదన చాలా ఎక్కువగా ఉంది. "అని పార్టీ తన తీర్మానంలో ఆరోపించింది. ఈ వర్గాల హక్కుల పరిరక్షణ కోసం చట్టపరమైన యంత్రాంగాన్ని మరింత పటిష్టం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని పేర్కొంది.

నేషనల్ కౌన్సిల్ ఫర్ సోషల్ జస్టిస్
హైదరాబాద్ యూనివర్సిటీకి చెందిన రీసెర్చ్ స్కాలర్ వేముల 2016లో హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
జనవరి 17, 2016న 26 ఏళ్ల దళిత విద్యార్థి మృతితో ఉన్నత విద్యా సంస్థల్లో కులతత్వానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళన మొదలైంది.నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ తరహాలో నేషనల్ కౌన్సిల్ ఫర్ సోషల్ జస్టిస్ను ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఇది భారతదేశ సామాజిక న్యాయ విధానాలు, చట్టాలను అమలు చేయడంలో పురోగతి, అంతరాలను సమీక్షించడమే కాకుండా హక్కులను స్పష్టంగా పరిరక్షించడం, బలోపేతం చేయడం, రక్షించడం వంటివి నేషనల్ కౌన్సిల్ ఫర్ సోషల్ జస్టిస్ చేస్తుందని వివరించింది.
-
బంగారం ధరల్లో లాభాల మోత -
బెంగళూరు, మైసూర్ కు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
రేషన్ కార్డు దారులకు ప్రభుత్వం బంపరాఫర్ - తాజా గడువు, మార్గదర్శకాలు..!! -
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
SRH vs RR: ట్రాక్ రికార్డ్ వర్సెస్ ఫామ్-ఆ ఒక్కడే గేమ్ ఛేంజర్ ..! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి ఉన్నవారి మే నెల జాతక ఫలం











Click it and Unblock the Notifications