చంపాలనుకుంటున్నారు కానీ బెదరను: తస్లీమా నస్రీన్
ఢిల్లీ: మతఛాందసవాదులు తనను చంపాలనుకుంటున్నారని, అయితే నేను వారిని ప్రతిఘటిస్తానని ప్రముఖ బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా నస్రీన్ శనివారం నాడు అన్నారు. తుది వరకు నేను మత చాంధసవాదులతో పోరాడుతానని చెప్పారు.
మతఛాందసవాదుల పట్ల మౌనం వహించబోనని, మరణించే వరకు ఆ దుష్ట శక్తులతో పోరాడుతూనే ఉంటానని ఆమె చెప్పారు. ఢిల్లీలో జరుగుతున్న ఓ సాహిత్య కార్యక్రమంలో తస్లీమా నస్రీన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
తనకు బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ అన్నా, పనిపట్ల అతని చిత్తశుద్ధి అన్నా చాలా ఇష్టమని చెప్పారు. అయితే, ఆయన స్థానంలో తాను ఉండి ఉంటే భారత్ వదిలి వెళ్తానని మాత్రం చెప్పకపోయి ఉండేదానిని అని వ్యాఖ్యానించారు.

ఘర్షణలకు రచయితలు కారణం కాదన్నారు. మతఛాందసవాదులకు భయపడి నేను నా రచనలను ఆపేస్తే, ఛాందసవాదులు గెలిచినట్లవుతుందని, కాబట్టి నేను ఎట్టి పరిస్థితుల్లోను వాటిని ఆపే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు.
కాగా, బంగ్లాదేశ్లో హిందువుల పైన జరుగుతున్న ఘోరాలను ఆమె గతంలో ఓ పుస్తకం ద్వారా వెల్లడించారు. దానిని కొందరు అడ్డుకున్నారు. ఈ పుస్తకం నేపథ్యంలో ఆమె పైన దాడి ప్రయత్నాలు కూడా జరిగాయి. అదే సమయంలో ఇటీవల మత అసహనంపై అమీర్ ఖాన్ వ్యాఖ్యలను ఒకింత తప్పుబట్టారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications