Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బెంగాల్‌లో చివరి రోజు పోటాపోటీ ప్రచారం... మమత‌ నియంతృత్వంపై మోడీ ఆగ్రహం..

కోల్‌కతా : ప్రధాని నరేంద్రమోడీ బెంగాల్ సీఎం మమత బెనర్జీపై మరోసారి విమర్శలు గుప్పించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన.. దీదీపై నిప్పులు చెరిగారు. సాయంత్రం ఎన్నికల ర్యాలీలో పాల్గొనేందుకు బెంగాల్ వెళ్తున్నానన్న మోడీ... మమత తన హెలికాప్టర్‌ ల్యాండ్ చేసేందుకు అనుమతి ఇస్తారో లేదోనని అనుమానం వ్యక్తం చేశారు. దీదీ తన సహజ ధోరణిని ప్రదర్శిస్తే డుమ్ డుమ్‌లో తన హెలికాప్టర్ దిగేందుకు అనుమతించరని విమర్శించారు..

ఇదిలా ఉంటే ఎలక్షన్ కమిషన్ నిర్ణయంతో బెంగాల్‌లో ఎన్నికల ప్రచారం మరికొన్ని గంటల్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్‌లు పోటాపోటీ ర్యాలీలకు సిద్ధమవుతున్నాయి. ప్రధాని నరేంద్రమోడీ రెండు బహిరంగ సభల్లో పాల్గొననుండగా.. ఆయనతో ఢీ అంటే ఢీ అంటున్న మమత బెనర్జీ నాలుగు ప్రాంతాల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు.

If Mamata has her way she will not allow helicopter to land : Modi

బెంగాల్‌లో ప్రచారానికి చివరి రోజు కావడంతో ప్రధాని మోడీ మధురాపూర్, డుమ్‌డుమ్‌లలో బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. సీఎం మమతాబెనర్జీ నార్త్ 24 పరిగణాలు, డైమండ్ హార్బర్‌లో జరిగే ర్యాలీలతో పాటు సౌత్ వెస్ట్ పరిగణాలు, కోల్‌కతాలో రోడ్ షోల్లో పాల్గొననున్నారు. నార్త్ పరిగణాలో సభలో పాల్గొన్న తర్వాత డైమండ్ హార్బర్ చేరుకోనున్న మమత అనంతరం సౌత్ వెస్ట్ పరిగణాలు, కోల్‌కతాలో ప్రచారంలో పాల్గొననున్నారు. మరోవైపు మోడీ సాయంత్రం నాలుగున్నరకు మధురాపూర్, ఆరింటికి డుమ్ డుమ్‌లో జరిగే ర్యాలీల్లో పాల్గొంటారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+