హత్య: అపార్ట్మెంట్ పైనుంచి పడి ఐఐటి విద్యార్థి మృతి

అంచల్ భరద్వాజ్(21) అనే ఎంటెక్ విద్యార్థి శుక్రవారం ఆ భవనంపై నుంచి పడి మృతి చెందాడు. అయితే బాధితుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాతే ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మృతుడి తండ్రి మహావీర్ భరద్వాజ్ కథనం ప్రకారం.. భరద్వాజ్ సెక్టార్ 22లోని అపార్ట్మెంట్లో పెయింగ్ గెస్ట్గా ఉంటున్నాడు. సమీపంలోని అపార్ట్మెంట్లో భరద్వాజ్ కజిన్, అతని భార్యతోపాటు ఉంటున్నాడు. తరచుగా వారి ఇంటికి వెళుతుండేవాడు భరద్వాజ్. శుక్రవారం భరద్వాజ్ను అతని కజిన్ భోజనానికి ఇంటికి పిలిచాడు. ఆ తర్వాత సాయంత్రానికి ఆ అపార్ట్మెంట్ పైనుంచి పడిపోయాడు.
తీవ్రగాయాలపాలైన భరద్వాజ్ను ఫోర్టిస్ ఆస్పత్రికి తరలించారు. అయితే అతడు మార్గమధ్యలోనే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కాగా, తమ అపార్ట్మెంట్లో బంగారు నగలు పోయాయని కజిన్, అతని భార్య అంచల్ భరద్వాజ్ను అనుమానించారని తండ్రి మహావీర్ తెలిపారు. ఈ నేపథ్యంలోనే అంచల్ భరధ్వాజ్ నివాసముంటున్న గదిని తనిఖీ చేశారని చెప్పారు.
ఆ తర్వాత అతడ్ని ఇంటికి పిలిపించి వారే హత్య చేసి ఉంటారని మహావీర్ భరద్వాజ్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మహావీర్, హర్యానాలో టీచర్గా విధులు నిర్వహిస్తున్నాడు. ఇది ఇలా ఉండగా అంచల్ గదిలోనే తమ బంగారు నగలు దొరికాయని అతని కజిన్ పోలీసులకు వెల్లడించాడు.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications