ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య
ప్రియుడితో కలిసి భర్తను చంపింది భార్య,.చెన్పైలో ఉండే గోపాలకృష్ణ, ఆయన భార్య సతీమణి నివాసం ఉంటారు. భారతికి కార్తీక్ రవీంద్రన్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయమై గోపాలకృష్ణ ఆమెను అనుమానించి వే
చెన్నై :వివాహేతర సంబంధంతో కట్టుకొన్న భర్తను హత్యచేసింది భార్య. ప్రియుడితో కలిసి ఆమె భర్తను చంపేసింది.ఈ ఘటన చెన్నైలో చోటుచేసుకొంది చెన్నై కు లోని పడపళనిలో భక్తవత్సలం రెండో వీధిలో గోపాలకృష్ణన్, భారతి దంపతులు నివాసం ఉంటున్నారు.
గోపాలకృష్ణన్ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగి. అతడి భార్య భారతి కార్తీక్ రవీంద్రన్ అనే వ్యక్తితో కొంత కాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. భార్య తీరుపై అనుమానం వచ్చిన భర్త గోపాలకృష్ణన్ ఆమెను వేధించేవాడు.
ప్రియుడికి భారతి ఈ విషయాన్ని చెప్పింది.దీంతో గోపాలకృష్ణన్ చంపాలని వారు నిర్ణయించుకొన్నారు. ఈ మేరకు పథకం రచించారు. మంగళవారం రాత్రి గోపాలకృష్ణన్ నిద్రపోతుండగా గొంతుకోసి హత్యచ ేశారు. కార్తీక రవీంద్రనే గోపాలకృష్ణన్ గొంతు కోశాడు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో భారతిని తాళ్ళతో కట్టివేశాడు.
ఇంట్లోని నగలు, మొబైల్ ఫోన్లు, డబ్బును తీసుకొని వెళ్ళాడు దొంగతనాన్ని వచ్చి గోపాలకృష్ణన్ దొంగలే హత్యచేశారని అందరినీ నమ్మించేవిధంగా వ్యవహారించారు. గోపాలకృష్ణన్ హత్య చేసి పారిపోతున్న రవీంద్రను పెట్రోలింగ్ పోలీసులకు దొరికాడు. పోలీసుల ప్రశ్నలకు అడ్డదిడ్డమైన సమాధానాలు చెప్పాడు. అనుమానం వచ్చిన అతణ్ణి పోలీసులు విచారించారు. దీంతో గోపాలకృష్ణన్ హత్యచేసిన విషయం వెలుగులోకి వచ్చింది.