Illegal affair: భార్య, ప్రియుడు ఫుల్ ఎంగేజ్, అత్త ఫుల్ సపోర్ట్, ఇద్దర్నీ నిలబెట్టి నరికేసిన భర్త !
బెంగళూరు: భార్య అక్రమ సంబంధం కారణంగా భర్త పైత్యం పీక్ స్టేజ్ కు వెళ్లిపోయింది. లాక్ డౌన్ లో పక్కింటోడు ఇంటి దగ్గరే ఖాళీ ఉన్నాడని భార్య అతనికి సైలెంట్ గా సిగ్నల్ ఇచ్చింది. గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే ఆ యువకుడు రెడ్ లైట్ వెయ్యకుండా రెండు గ్రీన్ లైట్లు వేశాడు. భార్య, ఆమె ప్రియుడు ట్రాఫిక్ సిగ్నల్స్ గురించి తెలుసుకున్న భర్త చాలాసార్లు రెడ్ లైట్ వేసి వారి స్పీడ్ కు బ్రేకులు వెయ్యడానికి ప్రయత్నించాడు. ఇదే సమయంలో భార్య తల్లి కూడా కూతురికి రైట్ రైట్ అని చెప్పడంతో భర్తకు ఎక్కడో మండిపోయింది. అంతే భార్యకు చెప్పిచెప్పి విసిగిపోయిన భర్త ఓ నిర్ణయం తీసుకున్నాడు. తన పరువు తీసి బజారులో ప్రియుడితో కులుకుతున్న భార్యను, ఆమె అక్రమ సంబంధం గురించి తెలిసినా కూతురికే సపోర్టు చేస్తున్న అత్తను ఒకేసారి నిలబెట్టి అడ్డంగా నరికి చంపేయడం కలకలం రేపింది.
Beauty business: అమ్మాయిలు, ఆంటీలు పెట్టుబడి, లాక్ డౌన్ లో భర్తలు లక్షాధికారులు !
జీవితాంతం హ్యాపీగా ఉంటారని పెళ్లి చేశారు
కర్ణాటకలోని హాసన్ జిల్లాలోని అరసికెరె తాలుకాలోని గండసి పోలీస్ స్టేషన్ లోని రంగాపుర గ్రామంలో శ్రీధర్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. అరెసికెరె సమీపంలోనిన జావగల్ తాలుకా హరళహళ్ళి గ్రామంలో నివాసం ఉంటున్న పరమేశ్వర్, భారతి దంపతుల కుమార్తె మంజుల (28) అనే యువతితో ఐదు సంవత్సరాల క్రితం శ్రీధర్ వివాహం జరిగింది.
దంపతుల సంసారం లెక్కల్లో 5 -2 పోయింది
రెండు మూడు సంవత్సరాలు శ్రీధర్, మంజుల కాపురం సవ్యంగా జరిగినా తరువాత ఇద్దరి మద్య గొడవలు మొదలైనాయి. శ్రీధర్, మంజుల దంపతులకు ఓ కుమారుడు కుమార్తె ఉన్నారు. రెండు సంవత్సరాల నుంచి శ్రీధర్, మంజుల కుటుంబ సభ్యులు ఇద్దరికి బుద్దిమాటలు చెబుతూ వచ్చారు. రెండు గ్రామల పెద్దలు వీరికి రాజీ ప్రయత్నాలు చేసినా ఎలాంటి మార్పురాలేదు.
కుర్రాడు ఖాళీగా ఉన్నాడని భార్య గ్రీన్ సిగ్నల్
2020 ఏప్రిల్ నెలలో కరోనా వైరస్ దెబ్బతో లాక్ డౌన్ అమలు చేసిన సమయంలో శ్రీధర్, మంజుల దంపతుల కథ మలుపు తిరిగింది. మంజుల, శ్రీధర్ దంపతులు నివాసం ఉంటున్న రంగాపురంలోనే నివాసం ఉంటున్న బాబు అనే యువకుడు మంజులకు దగ్గర అయ్యాడు. లాక్ డౌన్ లో పక్కవీధిలో నివాసం ఉంటున్న బాబు ఖాళీగా ఉన్నాడని మంజుల అతనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
లాక్ డౌన్ లో భార్య లిప్ లాక్
లాక్ డౌన్ సమయంలో బాబు కూడా మంజులకు దగ్గర అయిపోయాడు. గ్రామంలో లాక్ డౌన్ ప్రభావం ఎక్కువగా లేకపోవడంతో ఎవరికి వాళ్లు పొలం పనుల్లో ఉండిపోవడంతో మంజుల, బాబు మరింత దగ్గర అయిపోయారు. లాక్ డౌన్ సమయంలో భార్య మంజుల, బాబు లిప్ లాక్ నుంచి బెడ్ రూమ్ వరకు కథ నడిపేశారు.
బుద్దిమాటలు చెప్పిన భర్త........ బుర్రకథ చెప్పాడనుకున్న భార్య
ఆరు నెలలకే భార్య మంజుల, ఆమె ప్రియుడు బాబు వ్యవహారం భర్త శ్రీధర్ కు తెలిసిపోయింది. నువ్వు పద్దతిగా కాపురం చేసుకుంటే జీవితాంతం అందరూ సుఖంగా ఉంటామని, లేదంటే మన జీవితాలతో పాటు ఇద్దరు పిల్లల జీవితాలు నాశనం అయిపోతాయని భర్త శ్రీధర్ భార్య మంజులకు బుద్దిమాటలు చెప్పాడు. తన భర్త ఏదో బుర్రకథ చెబుతున్నాడని మంజుల ఏమాత్రం పట్టించుకోలేదు.
అత్త చేసిన పనికి అల్లుడికి ఎక్కడో కాలిపోయింది
రానురాను మంజుల, బాబు ఎక్కడపడితే అక్కడ తిరుగుతూ ఎంజాయ్ చెయ్యడం మొదలుపెట్టారు. భర్త పనిమీద బయట ఊరికి వెళ్లినప్పుడు మంజుల ఆమె ప్రియుడిని ఇంటికే పిలిపించుకోవడం మొదలుపెట్టింది. నీ కూతురు వేరే వ్యక్తితో కులుకుతోందని, నువ్వు బుద్దిమాటలు చెప్పాలని అల్లుడు శ్రీధర్ అతని అత్త భారతికి చెప్పాడు. అయితే కూతురి విషయంలో భారతి ఏమాత్రం పట్టించుకోలేదని ఆరోపణలు ఉన్నాయి.
Recommended Video
భార్య, అత్తను అడ్డంగా నరికేశాడు
తన భార్య మంజుల బజారులో ప్రియుడితో తిరిగి తన పరువు రోడ్డుకు ఈడుస్తోందని భర్త శ్రీధర్ రగిలిపోయాడు. బంధువులు, స్నేహితులు సూటిపోటి మాటలు మాట్లాడటం తట్టుకోలేకపోయాడు. అంతే పదునైన ఆయుధం తీసుకున్న శ్రీధర్ అతని భార్య మంజుల, అత్త భారతి మీద దాడి అతి దారుణంగా చంపేశాడు. అక్రమ సంబంధం కారణంగా భార్యతో పాటు ఆమె తల్లి ఒకేసారి హత్యకు గురికావడం కలకలం రేపింది.