girlfriend: అక్రమ సంబంధం, మద్యాహ్నం కోరిక తీర్చినా, రాత్రికి రమ్మంటే ఎలా ?, నీకు అదే పనేనా ? !
చెన్నై/ధర్మపురి: వివాహం చేసుకున్న మహిళకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వివాహం చేసుకుని భార్యతో కాపురం చేస్తున్న వ్యక్తి ఆమెకు పరిచయం అయ్యాడు. రానురాను ఇద్దరు అక్రమ సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేశారు. అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళ ఆమె ప్రియుడు ఎక్కడికి పిలిచినా ఆమె వెళ్లి అతని కోరిక తీర్చి వస్తోంది. మద్యాహ్నం ఇద్దరూ రహస్య ప్రాంతంలోకి వెళ్లి ఎంజాయ్ చేసి ఎవరిదారిన వారు వెళ్లిపోయారు. రాత్రి ప్రియురాలికి ఫోన్ చేసిన ప్రియుడు నా కోరిక తీర్చడానికి రావాలని పిలిచాడు. నువ్వు పిలిచినప్పుడు అంతా నేను రాను అని ప్రియురాలు తేల్చి చెప్పింది. నా ప్రియురాలికి ఇంకో రంకు మొగుడు ఉన్నాడని ఆమె ప్రియుడు రగిలిపోయాడు.
romance: నాటీ అల్లుడు, రొమాంటిక్ అత్త, అర్దరాత్రి అత్తను లేపుకుపోయిన కొత్త అల్లుడు, హయ్యారే హయ్యా !
అడవిలో మహిళ శవం
తమిళనాడులోని ధర్మపురి జిల్లాలోని గిజనూరు అటవి ప్రాంతంలో 32 ఏళ్ల మహిళ మృతదేహం పడి ఉన్న విషయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. గీజానూరు అడవిలోకి వెళ్లిన పోలీసులు మహిళ మృతదేహం పరిశీలించారు. పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి ధర్మపురి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పార్వతి భర్త చనిపోయాడు
మృతి చెందిన మహిళ పేరు పార్వతి అని, ఆమె భర్త పేరు ఆండియప్పన్ అని పోలీసులు గుర్తించారు. ఆండియప్పన్, పార్వతికి వివాహమై 12 ఏళ్లు అయిందని, ఆండియప్పన్ గత 9 ఏళ్ల క్రితం మరణించాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. భర్త ఆండియప్పన్ చనిపోయిన తరువాత పార్వతి ఆమె పిల్లలతో కలిసి ఆమె సొంతంగా పండిస్తున్న కూరగాయల తోటలో ఇంటిలో నివాసం ఉంటున్నది పోలీసులు అన్నారు.
శక్తివేల్ తో సరసాలు
ఒంటరిగా ఉంటున్న పార్వతి గత ఏడాది కాలంగా శక్తివేల్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. శక్తివేల్కి పెళ్లయింది. అయితే శక్తివేల్ భార్య 15 ఏళ్ల క్రితం చనిపోయింది. తరువాత శక్తివేల్ రెండో పెళ్లి చేసుకున్నాడు. అయితే శక్తివేల్ రెండో భార్యకు సంతానం కలగలేదని, అందుకే అతను పార్వతితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.
అడవిలోకి వెళ్లి వచ్చారు
శక్తివేల్ అతని ప్రియురాలు పార్వతి నిత్యం గిజనూరు అటవి ప్రాంతానికి వెళ్లి రొమాన్స్ చేసి తిరిగి వస్తున్నారు. రెండు రోజుల క్రితం శక్తివేల్, పార్వతి ఇద్దరూ గీజానూరు ప్రాంతానికి వెళ్లి ఎంజాయ్ చేశారు. తరువాత ఎవరిదారిలో వారు వెళ్లిపోయారు. అదే రోజు రాత్రి శక్తివేల్ అతని ప్రియురాలు పార్వతికి ఫోన్ చేసి అటవి ప్రాంతంలోకి రావాలని, నాకోరిక తీర్చాలని ఆమెను పిలిచాడు. .
ప్రియురాలికి ఇంకో రంకు మొగుడు ఉన్నాడా ?
మద్యాహ్నం నీకోసం వచ్చి వెళ్లాను, ఇంట్లో పిల్లలు ఉన్నారు, నువ్వు పిలిచిన ప్రతిసారి నేను రానని, నాకు అవసరం అయినప్పుడు నీకు ఫోన్ చేస్తాను అప్పుడు నువ్వు రావాలని పార్వతి తేల్చిచెప్పింది. చివరికి మరుసటి రోజు పార్వతి, శక్తివేల్ అటవి ప్రాంతంలో ఏకాంతంగా కలిశారు. మోజు తీర్చుకున్న తరువాత శక్తివేల్ నీకు వేరే వ్యక్తితో అక్రమ సంబంధం ఉందని, అందుకే నేను పిలిచినప్పుడు రావడం లేదని రగిలిపోయాడు. పార్వతి కూడా ప్రియుడు శక్తివేల్ తో గొడవ పడింది.
ఇనుప రాడ్ తో కొట్టి చంపేశాడు
ఇద్దరి మద్య వాగ్వాదం జరిగింది. ఆ సమయంలో చెట్టు సమీపంలో దాచి ఉంచిన ఇనుప రాడ్ని తీసుకున్న శక్తివేల్ ప్రియురాలు పార్వతి ముఖం, తల మీద ఇష్టం వచ్చినట్లు దాడి చేసి చేశాడు. ప్రియురాలు పార్వతిని హత్య చేసిన ప్రియుడు శక్తివేల్ కోసం పోలీసులు గాలించి చివరికి అతన్ని పట్టుకున్నారు.
అర్దరాత్రి భార్య కోరిక తీర్చలేదని ?
ఉత్తరప్రదేశ్ కొన్ని రోజుల క్రితం ఇలాంటి షాకింగ్ సంఘటన జరిగింది.మహ్మద్ అన్వర్ అమ్రోహా జిల్లాలో నివసిస్తున్నాడు. మెహమ్మద్ భార్య పేరు రుక్సానా. రాత్రి ఒకసారి భర్త మోహమ్మద్ కు శారీరక కోరిక తీర్చిన రుక్సానా తరువాత పిల్లలతో కలిసి నిద్రపోయింది. రెండోసారి కోరిక తీర్చడానికి రుక్సనా నిరాకరించడంతో సహనం కోల్పోయిన మోహమ్మద్ ఆమెను ఇనుపరాడ్ తో కొట్టి చంపేశాడు.