Illegal affair: ప్రియుడితో ముచ్చటగా మూడోసారి జంప్, ఎర్రగా ఉన్నానని బలుపు, కట్ చేస్తే ఫ్యాన్ కు వేలాడుతూ !
చెన్నై/ తిరువళ్లూరు: పెద్దలు సెట్ చేసిన పెళ్లి చేసుకున్న దంపతులు కాపురం చేశారు. దంపతులకు ఇద్దరు పిల్లలు పుట్టారు. పిల్లలు పుట్టిన తరువాత దంపతులు హ్యాపీగానే ఉన్నారు. భర్తకు దూరపు బంధువు అయిన వ్యక్తితో భార్య అక్రమ సంబంధం పెట్టుకుని అతనితో ఎంజాయ్ చేసింది, భార్య మ్యాటర్ తెలుసుకున్న భర్త ఆమెకు వార్నింగ్ ఇచ్చాడు. భర్త వార్నింగ్ ఇవ్వడంతో అతని భార్య ఆమె ప్రియుడితో కలిసి పారిపోయింది. నెల రోజుల తరువాత భార్యను పట్టుకుని వచ్చిన పోలీసులు రాజీ చేసి ఆమెను భర్తకు అప్పగించారు. కొన్ని రోజుల తరువాత ఆమె మళ్లీ ప్రియుడితో పారిపోయింది. ఈసారి బంధువులు ఆమెను పట్టుకుని వచ్చి భర్తకు అప్పగించారు. మూడోసారి ముచ్చటగా ప్రియుడితో కలిసి పారిపోయింది. ఛీ ఈజీవితం అంటూ విసిగిపోయి ఆమె భర్త సైలెంట్ అయిపోయాడు. ప్రియుడితో అక్రమ సంబంధం పెట్టుకుని అతనితో కలిసి పారిపోయి ఎంజాయ్ చేస్తున్న కిలాడీ లేడీ శవం కుళ్లిపోయిన స్థితిలో తాడుకు వేలాడుతూ కనపడటం కలకలం రేపింది.
భర్త స్కూల్ బస్సు డ్రైవర్
తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలోని చోళవరం సమీపంలోని ఎరుమైవెట్టిపాళ్యలంలో బాబు అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం పెద్దలు కుదిర్చిన అముద అనే యువతితో బాబు వివాహం జరిగింది. పెద్దలు సెట్ చేసిన పెళ్లి చేసుకున్న బాబు, అముద దంపతులు కాపురం చేశారు. బాబు ప్రైవేట్ స్కూల్ బస్సు డ్రైవర్ గా ఉద్యోగం చేస్తున్నాడు.
భర్త బందువుతో కిలాడీ లేడీ అక్రమ సంబంధం
అముద, బాబు దంపతులకు ఇద్దరు పిల్లలు పుట్టారు. పిల్లలు పుట్టిన తరువాత కూడా కొన్ని సంవత్సరాలు బాబు, అముద దంపతులు హ్యాపీగానే ఉన్నారు. భర్త బాబుకు దూరపు బంధువు అయిన జోతీశ్వరన్ అనే వ్యక్తితో అముద చనువు పెంచుకుని అతనికి దగ్గర అయ్యింది. జ్యోతీశ్వరన్ తో అక్రమ సంబంధం పెట్టుకున్న అముద అతనితో పిచ్చపాటిగా ఎంజాయ్ చేసింది,
పాండీచ్చేరీలో ప్రియుడితో ఎంజాయ్
గత
ఏడాది
వరకు
బాబు
భార్య
అముద
అక్రమ
సంబంధం
విషయం
ఎవ్వరికీ
తెలీలేదు.
గత
జనవరి
నెలలో
అముద
అక్రమ
సంబంధం
మ్యాటర్
తెలుసుకున్న
ఆమె
భర్త
బాబు
రగిలిపోయాడు.
పద్దతి
మార్చుకోవాలని
అముదాకు
బాబు
వార్నింగ్
ఇచ్చాడు.
భర్త
బాబు
వార్నింగ్
ఇచ్చిన
కొన్ని
రోజులకే
అముద
ఆమె
ప్రియుడు
జోతీశ్వరన్
తో
కలిసి
పుదుచ్చేరి
(పాండీచ్చేరి)
పారిపోయి
అక్కడ
అతనితో
ఎంజాయ్
చేసింది.
పోలీసులు పట్టుకుని వచ్చారు
నా భార్య అముద కనపడటం లేదని బాబు పోలీసు కేసు పెట్టారు. కేసు నమోదు చేసి పోలీసులు అముద కోసం గాలించారు. ప్రియుడితో లేచిపోయిన అముదను నెల రోజుల తరువాత పుదుచ్చేరీలో పట్టుకున్న తిరువళ్లూరు పోలీసులు ఆమెను పిలుచుకుని వచ్చి కౌల్సిలింగ్ నిర్వహించి బాబుతో రాజీ చేసి అతనికి అప్పగించారు.
ముచ్చటగా మూడోసారి జంప్
పోలీసులు భర్త బాబుకు అప్పగించిన మూడో రోజు మళ్లీ అముద ఆమె ప్రియుడు జోతీశ్వరన్ తో లేచిపోయిందిద. ఈసారి రంగంలోకి దిగిన అముద కుటుంబ సభ్యులు, బంధువుల 20 రోజుల తరువాత ఆమె ఆచూకి తెలుసుకుని ఆమెను పట్టుకుని వచ్చి చితకబాది ఆమెకు బుద్దిమాటలు చెప్పి భర్త బాబుకు అప్పగించారు. బాబుతో నెల రోజుల పాటు కాపురం చేసిన అముద ముచ్చటగా మూడోసారి అంటూ ఆమె ప్రియుడు జగదీశ్వరన్ తో కలిసి జెండా ఎత్తేసింది.
ఛీ ఈజీవితం....... భార్యను పూర్తిగా వదిలేసిన భర్త
బాబుతో నెల రోజుల పాటు కాపురం చేసిన అముద ముచ్చటగా మూడోసారి అంటూ ఆమె ప్రియుడు జగదీశ్వరన్ తో కలిసి జెండా ఎత్తేసింది. ఛీ దీనెమ్మ ఈజీవితం అంటూ విసిగిపోయి బాబు అతని భార్య అముద గురించి ఆలోచించడం మానేసి సైలెంట్ గా పిల్లలతో కలిసి ఉండిపోయాడు. ప్రియుడు జగదీశ్వరన్ తో అక్రమ సంబంధం పెట్టుకుని అతనితో కలిసి పారిపోయిన అముదా ఇంతకాలం ఎంజాయ్ చేసింది.
నా ప్రియుడు నన్ను మోసం చేశాడు
కొన్ని రోజుల క్రితం పూజల్ ప్రాంతంలో అముద ఆమె భర్త బాబు స్నేహితుడు శివప్రకాష్ కు కనపడింది. నా భర్త బాబు, ఇద్దరు పిల్లలకు ద్రోహం చేసి ప్రియుడు జ్యోతీశ్వరన్ నమ్ముకుని వచ్చేశానని, నా ప్రియుడు పెళ్లి చేసుకోకుండా మోసం చేశాడని బోరన విలపించిందని తెలిసింది. అయితే సోమవారం అముద నివాసం ఉంటున్న ఇంటిలో ఫ్యాన్ కు వేలాడుతూ శవమై కనిపించింది.
ఫ్యాన్ కు వేలాడుతూ శవమైన భార్య
ఇంటి నుంచి దుర్వాసన వస్తుంటే స్థానికులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అముద విషయం వెలుగు చూసింది. అముదతో అక్రమ సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేసిన జోతీశ్వరన్ ఎస్కేప్ అయ్యాడని పోలీసులు అన్నారు. నా భార్య అముద హత్యకు గురైయ్యిందని, ఆమె ఆత్మహత్య చేసుకోలేదని బాబు కేసు పెట్టాడని, జ్యోతీశ్వరన్ కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. భర్త, పిల్లలను గాలికి వదిలేసి ప్రియుడితో పారిపోయి ఇంతకాలం ఎంజాయ్ చేసిన అముద శవం కుళ్లిపోయిన స్థితిలో తాడుకు వేలాడుతూ కనపడటం కలకలం రేపింది.