Wife: ఊరి నుండి భర్త అనుకోకుండా ఇంటికి వెళ్లాడు, భార్య మిడ్ నైట్ మసాలా చూసి, ప్రియుడు మాత్రం !
చెన్నై/ శివకాశి: వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేశారు. పెద్దల కుదిర్చిన పెళ్లి కావడంతో దంపతులు ఇరు వైపుల బంధువుల ఇళ్లకు వెళ్లి వస్తున్నారు. దంపతులు మాత్రం వేరే ప్రాంతంలో నివాం ఉంటున్నారు. భర్త, భార్య వేర్వేరుచోట్ల ఉద్యోగం చేస్తున్నారు. తల్లికి అనారోగ్యంగా ఉండటంతో చూసి వస్తానని చెప్పిన భర్త అతని సొంత ఊరికి వెళ్లాడు. తల్లికి ఆసుపత్రిలో చూపించిన అతను బయలుదేరి ఇంటికి వెళ్లాడు. అర్దరాత్రి ఇంట్లో భార్య మిడ్ నైట్ మసాలా చూసిన భర్తకు మైండ్ బ్లాక్ అయ్యి దిమ్మ తిరిగిపోయింది.
girlfriend: అక్రమ సంబంధం, మద్యాహ్నం కోరిక తీర్చినా, రాత్రికి రమ్మంటే ఎలా ?, నీకు అదే పనేనా ? !
ఉద్యోగం చేస్తున్న భార్య
తమిళనాడులోని విరూద్ నగర్ జిల్లాలోని శివకాశిలో విశ్వానందం ప్రాంతంలో నివాసం ఉంటున్న పాండిసెల్వం కొన్ని సంవత్సరాల క్రితం కుటుంబ సభ్యులు చూపించిన-రూపా అనే యువతిని వివాహం చేసుకున్నాడు, రూపా, పాండి సెల్వం దంపతులు సంతోషంగా కాపురం చేశారు. ఎటక్కపట్టిలోని క్రాకర్ ఫ్యాక్టరీలో పాండిసెల్వం భార్య రూపా పనిచేస్తోంది.
డ్రైవర్ బాగున్నాడని ?
శివకాశీ సమీపంలోని చతుర్ పతండాలై ప్రాంతానికి చెందిన కరుప్పసామి అదే బాణాసంచా ఫ్యాక్టరీలో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఒకే ఫ్యాక్టరీలో ఉద్యోగం చేస్తున్న రూపా, కరుప్పసామికి పరిచయం అయ్యింది. డ్రైవర్ కరుప్పస్వామి బాగా బలంగా ఉన్నాడని రుపా అతికి కన్ను కొట్టింది. చిలకకొట్టుడు కొడిచేత చిన్నదానా అంటూ కరుప్పస్వామి ఏకంగా రూపాకు కిస్ కొట్టాడు. తరువాత అసలు కథ మొదలైయ్యింది.
ప్రియుడితో పిచ్చపాటిగా ఎంజాయ్
రూపా భర్త పాండిసెల్వం వేరే చోట ఉద్యోగం చేస్తున్నారు. ప్రతిరోఉ ఉద్యోగం చెయ్యడానికి వెలుతున్న రూపా ఆమె పనిచేస్తున్న చోట డ్రైవర్ గా ఉద్యోగం చేస్తున్న కురుప్పస్వామితో చనువు పెంచుకుంది. ఫ్రీగా చిక్కిన రూపాతో కురుప్పస్వామి ప్రోసీడ్ అయ్యాడు. అంతే ఫ్యాక్టరీలో పని పూర్తి అయిన తరువాత కరుప్పస్వామితో కలిసి బైక్ లో వెలుతున్న రూపా అతనితో మోజు తీర్చుకుంది. కరుప్పస్వామితో అక్రమ సంబంధం పెట్టుకున్న రూపా అతనితో ఎంజాయ్ చేస్తూ వచ్చింది.
భర్త ఊరికి వెళ్లాడని ?
పాండిసెల్వం తల్లి కుమారలింగపురంలో నివాసం ఉంటున్నారు. తల్లికి అనారోగ్యంగా ఉండటంతో ఆమెను చూసేందుకు పాండిసెల్వం సాయంత్రం స్వగ్రామానికి వెళ్లారు. భర్త పాండిసెల్వం ఇంట్లో లేడని, మరుసటి రోజు వరకు రాడని తెలుసుకున్న రూపా ఆమె ప్రియుడు కరుప్పసామిని సాయంత్రమే ఇంటికి ఆహ్వానించింది. అంతే ప్రియుడు కరుప్పస్వామితో రూపా పిచ్చపాటిగా రాత్రి ఎంజాయ్ చేసింది. ఇద్దరూ ఏకాంతంగా బెడ్ రూమ్ లో సరదాగా గడిపడం మొదలుపెట్టారు.
భార్య మిడ్ నైట్ మసాలా చూసి ?
ఊరికి వెళ్లిన పాండిసెల్వం అతని తల్లికి ఆసుపత్రిలో చికిత్స చేయించి రాత్రి మళ్లీ శివకాశిలోని అతని ఇంటికి బయలుదేరాడు. తెల్లవారుజామున 2 గంటల సమయంలో పాండిసెల్వం అతని ఇంటికి తిరిగి వచ్చాడు. అ సందర్బంలో భార్య రూపా ఆమె ప్రియుడు కురుప్పస్వామి సరసాలాడుతున్న విషయం చూసిన పాండిసెల్వం రగిలిపోయాడు. చేతికి చిక్కిన రాళ్లు, కర్రతో భార్య రూపా, ఆమె ప్రియుడు కురుప్పస్వామి మీద దాడి చేశాడు.
భార్య బాయ్ ఫ్రెండ్ ను స్పాట్ లో చంపేసిన భర్త
భార్య రూపాను వదిలేసిన పాండి సెల్వం పెద్ద కర్ర తీసుకుని కురుప్పస్వామి తల ముక్కలు అయ్యేలా దాడి చేశాడు. పాండిసెల్వం దాడిలో తీవ్రగాయాలైన కరుప్పస్వామి రక్తపుమడుగులో అక్కడికక్కడే మృతి చెందాడు. కరుప్పస్వామిని హత్య చేసిన పాండిసెల్వం అతని భార్య రూపాను మాత్రం ప్రాణాలతో వదిలేశాడు. ఈ ఘటనపై ఇరుగుపొరుగు వారు శివకాశి నగర్ పోలీస్ స్టేషన్కు సమాచారం అందించారు.
కోపంలో ఎంతపని చేశాడు ?
పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కరుప్పస్వామి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం శవాన్ని ఆస్పత్రికి తరలించారు. కరుప్పస్వామిని హత్య చేసిన పాండిసెల్వంను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. భార్య రూపాతో వివాహేతర సంబంధం పెట్టుకున్న కురుప్పస్వామిని ఆమె భర్త పాండిసెల్వం హత్య చేసిన ఘటన శివకాశిలో కలకలం రేపింది.