బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Illegal affair: పగలు ప్రియుడు.... రాత్రి మొగుడు, కోటీశ్వరుడి హత్య కేసులో ట్విస్ట్, ప్లాన్ బి రివర్స్ !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కోట్ల రూపాయలు డబ్బు సంపాధిస్తూ రెండో పెళ్లి చేసుకుని రెండో పెళ్లామ్ చేతిలో దారుణ హత్యకు గురైన వ్యక్తి కేసు అనుకోని మలుపు తిరిగింది. మొదటి భార్యను దూరం పెట్టి బ్యూటీపార్లల్ లేడీతో ఎంజాయ్ చేసిన వ్యక్తి ఆమె చేతితోనే హత్యకు గురైనాడు. నా మొగుడు పరాయి మగాళ్లతో పడుకోమని బలవంతం చెయ్యడం వలనే అతన్ని చంపేశానని రెండో భార్య పోలీసులకు చెప్పింది. ఆస్తి కోసం తన భర్తను బ్యూటీపార్లల్ లేడీ చంపేసిందని రియల్ ఎస్టేట్ వ్యాపారి మొదటి భార్య కేసు పెట్టింది. అయితే ఈ రెండు పెద్ద మ్యాటర్ కాదని పోలీసులు అంటున్నారు. పోలీసుల విచారణలో దిమ్మతిరిగిపోయే విషయాలు బయటకు వచ్చాయి. బ్యూటీపార్లల్ లేడీకి ఆమె కంటే తక్కువ వయసు ఉన్న వ్యక్తితో అక్రమ సంబంధం ఉందని వెలుగు చూసింది. ప్రియుడితో కలిసి టిక్ టాక్ వీడియోలు చేసిన బ్యూటీపార్లల్ లేడీ అతని మోజులో పడిపోయిందని, భర్తను చంపేసి అతని ఆస్తి కొట్టేసి ఎంజాయ్ చెయ్యాలని స్కెచ్ వేసిందని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. కోటీశ్వరుడైన భర్తను చంపడానికి ప్రియుడు, ఆమె అక్క కొడుకును రంగంలోకి దింపిన కిలాడీ లేడి పక్కా స్కెచ్ తో అనుకున్న పని పూర్తి చేసిందని వెలుగు చూడటం కలకలం రేపింది. అయితే కిలాడీ లేడీ ప్లాన్ బీ రివర్స్ కావడంతో మొదటికే మోసం వచ్చింది.

Friend wife: ఫ్రెండ్ భార్య కత్తిలా ఉందని ?, కత్తితోనే బెదిరించి ఇద్దరు ఫ్రెండ్స్ ఏం చేశారంటే, క్లోజ్ !Friend wife: ఫ్రెండ్ భార్య కత్తిలా ఉందని ?, కత్తితోనే బెదిరించి ఇద్దరు ఫ్రెండ్స్ ఏం చేశారంటే, క్లోజ్ !

 రియల్ ఎస్టేట్ వ్యాపారంలో రూ. కోట్లు లాభం

రియల్ ఎస్టేట్ వ్యాపారంలో రూ. కోట్లు లాభం

ఐటీ హబ్ బెంగళూరులో సలార్ స్వామి అలియాస్ స్వామిరాజ్ అలియాస్ రాజ్ (50) అనే వ్యక్తి 25 సంవత్సరాల క్రితం సత్యకుమారి అనే మహిళను వివాహం చేసుకున్నాడు. స్వామిరాజ్, సత్యకుమారి దంపతులకు ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. స్వామిరాజ్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. ఐటీ హబ్ శివార్లలో ఎకరాల ఎకరాల భూములు తీసుకుని వెంచర్లు వేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారి స్వామిరాజ్ రూ. కోట్ల రూపాయల ఆస్తులు సంపాధించాడు.

 కిలాడీ లేడీ ఎంట్రీ

కిలాడీ లేడీ ఎంట్రీ

బెంగళూరు నగర శివార్లలోని మాదనాయకనహళ్ళిలో లేఔట్ వేసే సమయంలో స్వామిరాజ్ కు బ్యూటీపార్లల్ నిర్వహిస్తున్న నేత్రావతి అలియాస్ నేత్రా (37) అనే మహిళ పరిచయం అయ్యింది. బ్యూటీపార్లల్ బ్యూటీ నేత్రా అందానికి ఫిదా అయిపోయిన రియల్ ఎస్టేట్ వ్యాపారి స్వామిరాజ్ ఐదు సంవత్సరాల నుంచి ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. స్వామిరాజ్ ఎక్కువగా అక్రమ సంబంధం పెట్టుకున్న నేత్రాతో కాలం గడపడం మొదలుపెట్టాడు.

 గుడ్డిగా రెండో పెళ్లి చేసుకున్నాడు

గుడ్డిగా రెండో పెళ్లి చేసుకున్నాడు

రియల్ ఎస్టేట్ వ్యాపారి స్వామిరాజ్ ఆస్తులు చూపిన నేత్రా అతని మీద ఒత్తిడి చేసి అతన్ని రెండో పెళ్లి చేసుకుంది. మాదనాయకనహళ్ళి ప్రాంతంలో రూ. కొన్ని కోట్ల ఖర్చు పెట్టిన స్వామిరాజ్ అతని రెండో భార్య నేత్రాకు విలాసవంతమైన బంగ్లా కట్టించాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారి స్వామిరాజ్ కొత్తగా రెండో భార్య నేత్రాకు కట్టించిన బంగ్లాలో ఎక్కువగా నివాసం ఉంటూ అక్కడే ఆమెతో ఎంజాయ్ చేస్తున్నాడు.

4. అందరివాడు

 నా మొగుడిని చంపేశానని చెప్పిన రెండో భార్య

నా మొగుడిని చంపేశానని చెప్పిన రెండో భార్య

రాత్రి బయట పని ముగించుకున్న రియల్ ఎస్టేట్ వ్యాపారి అతని రెండో భార్య నేత్రా ఉంటున్న మాదనాయకనహళ్ళి ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో నేత్రా, స్వామిరాజ్ మద్య గొడవ జరిగిందని తెలిసింది. తరువాత స్వామిరాజ్ ను అతని రెండో భార్య నేత్రా దారుణంగా చంపేసింది. స్వామిరాజ్ ను హత్య చేసిన నేత్రా నేరుగా మాదనాయకనహళ్ళి పోలీస్ స్టేషన్ కు వెళ్లి నా భర్త స్వామిరాజ్ ను చంపేశానని చెప్పడంతో పోలీసులు షాక్ అయ్యారు. నిజంగానే నేత్రా భర్త స్వామిరాజ్ ను చంపేసిందని మొదట్లో పోలీసులు అనుకున్నారు.

 ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చెయ్యాలని చెప్పాడు

ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చెయ్యాలని చెప్పాడు

రెండో భార్య నేత్రాతో ఎక్కువగా కాలం గడుపుతున్న రియల్ ఎస్టేట్ వ్యాపారి స్వామిరాజ్ ఆమె చేతిలోనే కుక్కచావు చచ్చాడని వెలుగు చూడటంతో బెంగళూరులో కలకలం రేపింది. వ్యాపారలావాదేవీల కోసం ఫ్రెండ్స్ తో తనను పడుకోమని తన భర్త స్వామిరాజ్ టార్చర్ చేస్తున్నాడని, నేను ఆ పని చెయ్యలేక స్వామిరాజ్ ను చంపేశానని అతని రెండో భార్య నేత్రా మాదనాయకనహళ్ళి పోలీసులకు చెప్పింది. చూడటానికి నేత్రా అందంగా ఉండటంతో స్వామిరాజ్ నిజంగానే ఆమెతో అలా చేయించాడా ? అనే కోణంలో పోలీసులు ఆరా తీశారు.

 రెండో భార్య మీద మరో కేసు

రెండో భార్య మీద మరో కేసు

స్వామిరాజ్ ఆస్తి మొత్తం లాక్కోవాలని తన భర్తతో అక్రమ సంబంధం పెట్టుకున్న నేత్రా చంపేసిందని రియల్ ఎస్టేట్ వ్యాపారి మొదటి భార్య సత్యకుమారి , రియల్ ఎస్టేట్ వ్యాపారి స్వామిరాజ్ తండ్రి బసవరాజ్ కలిసి బ్యూటీపార్లల్ లేడీ నేత్రా మీద కేసు పెట్టారు. పోలీసులు రెండు కేసులు నమోదు చేసి విచారణ చేశారు. అయితే పోలీసుల విచారణలో దిమ్మతిరిగిపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.

 టిక్ టాక్ ప్రియుడు

టిక్ టాక్ ప్రియుడు

రియల్ ఎస్టేట్ వ్యాపారి స్వామిరాజ్ తో అక్రమ సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేసే సమయంలోనే నేత్రా టిక్ టాక్ వీడియోలు చేసి సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఆ సమయంలో కేఆర్ పురంలోని బిదరహళ్ళిలో నివాసం ఉంటున్న భరత్ అలియాస్ అచ్చు (30) అనే యువకుడు నేత్రాకు పరిచయం అయ్యాడు. నేత్రా కంటే వయసులో 7 సంవత్సరాలు భరత్ చిన్నోడు. తరువాత భరత్ కూడా టిక్ టాక్ వీడియోలు చేస్తూ నేత్రాకు దగ్గర అయ్యాడు. నేత్రా, భరత్ కలిసి టిక్ టాక్ వీడియోలు చేశారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

 పగలు ప్రియుడితో.....రాత్రి మొగుడితో కాపురం

పగలు ప్రియుడితో.....రాత్రి మొగుడితో కాపురం

స్వామిరాజ్ ను రెండో పెళ్లి చేసుకున్న నేత్రా అంతుకు ముందు నుంచే భరత్ తో అక్రమ సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేస్తోందని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. పగలు ప్రియుడు భరత్ తో కాపురం చేస్తున్న నేత్రా రాత్రి మాత్రం భర్త స్వామిరాజ్ తో కాపురం చేసిందని పోలీసులు అన్నారు. స్వామిరాజ్ ను ఆస్తుల మీద కన్ను వేసిన నేత్రా, ఆమె ప్రియుడు భరత్ అతన్ని చంపేసి ఆస్తులు స్వాధీనం చేసుకోవాలని చాలా కాలం నుంచి స్కెచ్ వేశారని పోలీసులు చెప్పారు. చివరికి నేత్రా, ఆమె ప్రియుడు భరత్, నేత్రా అక్క కొడుకు విజయ్ కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారి స్వామిరాజ్ ను చంపేశారని పోలీసులు అన్నారు.

 కేసు నుంచి తప్పించాలని కిలాడీ లేడీ స్కెచ్

కేసు నుంచి తప్పించాలని కిలాడీ లేడీ స్కెచ్

తన భర్త స్వామిరాజ్ ను తానే హత్య చేశానని లొంగిపోతే త్వరగా బెయిల్ వస్తుందని, మీరు హత్య కేసులో చిక్కుకుంటే అందరికి సమస్యలు వస్తాయని నేత్రా ఆమె ప్రియడు భరత్, అక్క కొడుకు విజయ్ కు చెప్పిందని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. తనకు బెయిల్ ఇప్పించాలని నేత్రా స్వామిరాజ్ ను హత్య చెయ్యకముందే రూ. 50 వేలు ప్రియుడు భరత్ కు ఇచ్చిందని పోలీసులు అన్నారు.

10. వాడికంటేనా

 ప్రియుడిని పట్టించిన ఫోన్ కాల్స్ డేటా

ప్రియుడిని పట్టించిన ఫోన్ కాల్స్ డేటా

స్వామిరాజ్ ను హత్య చెయ్యక ముందు నేత్రా, ఆమె ప్రియుడు భరత్, విజయ్ మాట్లాడుకున్న మొత్తం ఫోన్ కాల్ డేటా సేకరించామని మాదనాయకనహళ్ళి పోలీసులు చెప్పారు. మొత్తం మీద ప్రియుడు భరత్ మోజులో పడిన నేత్రా కోటీశ్వరుడైన భర్త స్వామిరాజ్ ను చంపేసి అడ్డంగా చిక్కిపోయింది. నేత్రాతో పాటు ఆమె ప్రియుడు భరత్, ఆమె అక్క కొడుకు విజయ్ ని కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఏదో అనుకుంటే ఏదో జరిగిపోందని ఇప్పుడు నేత్రా భరత్, విజయ్ ఊచలు లెక్కపెడుతున్నారు.

English summary
Illegal affair: Wife illegal relationship was the reason behind the husband murder case in Bengaluru city.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X