కర్నాటక ఎన్నికలు: ధనిక అభ్యర్థి ఆస్తి రూ.1020 కోట్ల, పేద అభ్యర్థి ఆస్తి రూ.1000
బెంగళూరు: ఏడీఆర్ రిపోర్ట్ ప్రకారం కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో 883 మంది కోటీశ్వరులు బరిలో నిలిచారు. మొత్తం 2560 మంది పోటీ చేస్తున్నారు.
బీజేపీ నుంచి 224 మంది పోటీ చేస్తుండగా 208 (93%) మంది, 220 మంది కాంగ్రెస్ అభ్యర్థుల్లో 207 (94%) మంది, 199 మంది జేడీఎస్ అభ్యర్థుల్లో 154 (77%), 25 మంది జేడీయూ అభ్యర్థుల్లో 13(52%) మంది, 27 మంది ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థుల్లో 9 (33%) మంది, మిగతా వారిలో 1090 మంది స్వతంత్ర అభ్యర్థుల్లో 199 (18%) మంది కోటీశ్వరులు.

అత్యధికంగా ఆస్తులున్నవారిలో మొదటి మూడు స్థానాల్లో ఉన్నవారు కాంగ్రెస్కు చెందిన అభ్యర్థులే. గోవిందరాజనగర్ నుంచి పోటీ చేస్తున్న ప్రియాకృష్ణ ఆస్తులు ఎక్కువగా ఉన్నాయి. అతని ఆస్తి రూ.10,20,53,87,250. అందరికంటే తక్కువగా ఆస్తి ఉన్న అభ్యర్థి బొమ్మనహళ్లి నుంచి పోటీ చేస్తున్న దిలీప్ కుమార్. ఇతనికి స్థిరస్తులు ఏమీ లేవు. చరాస్తులు రూ.1000. ఇతని మొత్తం ఆస్తి రూ.1000.
తనకూ యడ్యూరప్పకు మధ్య ఉన్న పోటీని తనకూ ప్రధాని మోడీకి మధ్య పోటీగా మార్చారని సీఎం సిద్ధారామయ్య అన్నారు. కాంగ్రెస్ అధికారాన్ని నిలబెట్టుకుంటుందన్నారు. హంగ్ వచ్చే సమస్యే లేదన్నారు. లింగాయత్లకు మైనారిటీ హోదా కట్టబెట్టే అంశం ప్రస్తుతం కర్ణాటక పరిధి నుంచి కేంద్ర పరిధిలోకి వెళ్లిందన్నారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications