Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Crime News: ఇంటికి రమ్మని ఫోన్ చేసింది.. రాగానే కూతురు అని చూడకుండా గొంతు కోసింది..

పిల్లలు అంటే తల్లి ఎంతో ప్రేమ ఉంటుంది. చాలా మంది తల్లులు పిల్లలే జీవితంగా బతుకుతారు. అయితే కొంత మంది పిల్లలు చేసిన పనికి తట్టులేక హత్యలకు పాల్పడుతున్నారు. పాము తన పిల్లల్ని తానే తిన్నట్టుగా తల్లిదండ్రులు తమ పిల్లల్ని పొట్టన పెట్టుకుంటున్నారు.

ఢిల్లీలోని బదర్‌పూర్‌కు చెందిన 21 ఏళ్ల యువతి ఆయుషి యాదవ్‌ ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆమె కుటుంబ సభ్యులకు తెలియకుండా ఓ వ్యక్తిని వివాహం చేసుకున్నారు. నవంబర్ 18న ఆమె ఇంటికి తిరిగి వచ్చారు. పెళ్లి విషయంలో ఆమెకు కుటుంబ సభ్యులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఆవేశంలో తండ్రి ఆయుషిపై కాల్పులు జరిపాడు. దీంతో ఆమె చనిపోయింది.

In Tamil Nadu, a mother killed her daughter because her daughter fell in love with a boy from a different caste

తల్లిదండ్రులు తమ కుమార్తె మృతదేహాన్ని ప్లాస్టిక్ సంచిలో చుట్టి సూట్‌కేస్‌లో పెట్టారు.నవంబర్ 19న తెల్లవారుజామున 3 గంటలకు, తల్లి,తండ్రి తమ కుమార్తె మృతదేహం ఉన్న సూట్‌కేస్‌ను యమునా ఎక్స్‌ప్రెస్ వే పక్క ఉన్న వ్యవసాయ పరిశోధనా కేంద్రం సమీపంలోని పొదల్లో పడేశారు. ఈ ఘటన మరవక ముందే తమిళనాడులోని తిరునల్వేలి జిల్లాలో బుధవారం నాడు తన కులానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి నిరాకరించినందుకు ఓ తల్లి తన 20 ఏళ్ల కుమార్తెను గొంతు కోసి హత్య చేసింది. యువతి హత్య కుల హత్యగా అనుమానిస్తున్నారు.

అరుణ అనే విద్యార్థిని కోయంబత్తూర్‌లోని ఒక ప్రైవేట్ నర్సింగ్ కాలేజీలో చదువుతుంది. ఈ క్రమంలో ఓ యువకుడితో ఆమె ప్రేమలో పడింది. ఇదే సమయంలో అరుణుకు ఇంటి వద్ద పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. విషయం తెలుసుకున్న అరుణ తన తల్లి ఆరుముగకాని కి ఫోన్ చేసి తన ప్రేమ గురించి చెప్పింది. దీంతో ఆమె తల్లి అరుణను వెంటనే ఇంటి రావాల్సిందిగా కోరింది.

అరుణ ఇంటి రాగానే ఆరుముగకాని ప్రేవ పెళ్లి వద్దని చెప్పింది. తాను ఓ పెళ్లి సంబంధం చూశానని అతన్నే వివాహం చేసుకోవాలని కోరింది. అయితే అరుణ పెళ్లిని వ్యతిరేకించడంతో వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆగ్రహానికి గురైన తల్లి కూతురిని గొంతుకోసి హత్య చేసింది. ఆ తర్వాత ఆమె ఆత్మహత్యకు కూడా ప్రయత్నించింది. వారిని గమనించిన చుట్టు పక్కల వారు వారిని చికిత్స నిమిత్తం వారిద్దరినీ తిరునల్వేలి మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు.

అక్కడికి చేరుకోగానే అరుణ మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ప్రస్తుతం ఆరుముగకానిఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. అరుణ తండ్రి, సోదరుడు ప్రస్తుతం చెన్నైలో ఆటో డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. కుల హత్య కోణంలో కేసును దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ హత్యకు సంబంధించి ఇప్పటి వరకు ఆరుముగకాని ఎలాంటి వివరాలు వెల్లడించలేదు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+