Vote: కోవిడ్ రోగులకు చాన్స్, తమిళ తంబీల ఓటు దెబ్బ, వాళ్లకు రాత్రి వరకు, డాన్ పీపీఇ కిట్లు!
చెన్న/పుదుచ్చేరి: ఓటు హక్కు ఎంత పవర్ ఫుల్ అనే విషయం అందరికి తెలిసిందే. ప్రతిఒక్క పౌరుడి చేతిలో ఓటు అనేది వజ్రాయుధం లాంటిది అనే మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా వైరస్ తాండవం చేస్తున్న సమయంలో తమిళనాడు, కేరళ, అస్సాం, పశ్చిమ బెంగాల్ తో పాటు పుదుచ్చేరి,లో కరోనా వైరస్ వచ్చినవాళ్లు, కోవిడ్ లక్షణాలు ఉన్నాయనే అనుమానంతో చికిత్స పొందుతున్న వారు ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఎన్నికల అధికారులు ప్రత్యేకంగా పోలింగ్ సమయం పొడగిస్తూ రాత్రి వాళ్లకు అవకాశం కల్పించారు.

తమిళనాడు, పుదుచ్చేరిలో !
తమిళనాడు రాష్ట్రంలో, కేంద్రపాలిత ప్రాంతం అయిన పుదుచ్చేరిలో మంగళవారం జోరుగా పోలింగ్ జరుగుతోంది. తమిళనాడులో, పుదుచ్చేరిలో అధికారంలోకి రావాలని అన్ని పార్టీల నాయకులు ఎవరి ప్రయత్నాలు వాళ్లు చేస్తున్నారు. తమిళనాడులో ఓటర్ల కాళ్లు పట్టుకుని మా పార్టీకి మీరు ఓటు వెయ్యండి అంటూ వాళ్లను వేడుకుంటున్నారు.

కోవిడ్ రోగులకు ప్రత్యేక సమయం
తమిళనాడులో, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరితోపాటు కేరళ, పశ్చిమ బెంగాల్, అస్సాంలో కరోనా వైరస్ (COVID-19) వ్యాధి సోకిన వాళ్లు, ఆ వ్యాధి లక్షణాలు ఉన్న వాళ్లు చాలా మంది ఉన్నారు. కరోనా రోగులు, కరోనా వైరస్ లక్షణాలు ఉన్న వాళ్లు ఓటు హక్కు వినిగియోగించుకోవడానికి ఎన్నికల అధికారులు అవకాశం ఇచ్చారు. వీళ్ల ఓటు వెయ్యడానికే పోలింగ్ సమయాన్ని పొడిగించారు.

ఇది ప్లాన్..... సమస్య ఉండదు
తమిళనాడు, పుదుచ్చేరితో పాటు మిగిలిన మూడు రాష్ట్రాల్లో సామన్య ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఇచ్చిన పోలింగ్ సమయం పూర్తి అయిన తరువాత కోవిడ్ రోగులు ఓటు హక్కు వినియోగించుకోవడానికి అవకాశం ఇచ్చారు. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు కోవిడ్ రోగులు పోలింగ్ కేంద్రాల్లో ఓటు వెయ్యడానికి ఎన్నికల అధికారులు అవకాశం ఇచ్చారు.

పీపీఇ కిట్లు, డాన్ పీపీఇ కిట్లు
అసోలేషన్ లో చికిత్స పొందుతున్న కోవిడ్ రోగులు అందరూ పీపీఇ కిట్లు, చేతికి గ్లోజ్ లు, ముఖానికి మాస్కులు, అదనంగా డాక్ పీపీఇ కిట్లు వేసుకుని వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాల్లో ఓటు వెయ్యడానికి అవకాశం ఇచ్చారు. కోవిడ్ రోగులు వస్తున్న పోలింగ్ కేంద్రాల్లో, పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే శానిజైటర్లు వేస్తున్నారు.

ఎన్నికల అధికారులు, సిబ్బంది
కోవిడ్ రోగులు ఓటు వెయ్యడానికి వెలుతున్న పోలింగ్ కేంద్రాల్లో ఉన్న అధికారులు, ఎన్నికల సిబ్బంది అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, వాళ్లు కూడా పీపీఇకిట్లు, మాస్క్ లు, చేతికి గ్లోజ్ లు వేసుకోవాలని ఎన్నికల అధికారులు సూచించారు. మొత్తం మీద తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, పశ్చిమ బెంగాల్, అస్సాంలో కోవిడ్ రోగుల కోసమే ప్రత్యేకంగా పోలింగ్ సమయం పొడగించారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications