కర్ణాటక ప్రభుత్వానికి మంత్రి షాక్...! మద్దతు ఉపసంహరించుకుంటున్న గవర్నర్కు లేఖ
కాంగ్రెస్ జేడిఎస్ ప్రభుత్వానికి మరో షాక్ తాగిలింది. ఇప్పటికే 13 మంది ఎమ్మెల్యేలు రాజీనామ చేయగా మరో ఇండిపెండెంట్ ఎమ్మెల్యే ప్రస్థుత మంత్రి కూడ ప్రస్థుత ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించాడు. ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా ఉన్న నగేష్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నట్టు ప్రకటించాడు. అనంతరం గవర్నర్ వాజుభాయి వాలాకు అందించాడు.
నార్త్ బీదర్ నుండి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా ఎన్నికైన నగేశ్ ప్రభుత్వానికి మద్దతు పలకడంతో ఆయనకు మంత్రి పదవి లభించింది. ఇక తాజ రాజకీయ పరిణామాల నేపథ్యంలో నగేశ్ రాజీనామాతో ప్రభుత్వం మరింత మైనారీటీలో పడింది. కాగా సమస్యను పరిష్కరించేందుకు పలువురు కాంగ్రెస్ నేతలు రంగంలోకి దిగారు.
ఇక ప్రస్థుతం ఎమ్మెల్యే రాజీనామతో ప్రభుత్వం 104కు పడిపోయింది. మొత్తం 224 సభ్యులున్న కర్ణాటక ఎమ్మెల్యేల్లో కాంగ్రెస్ 78, జేడిఎస్ 37,బీఎఎస్పీ1, ఇండిపెండెంట్ 1, కలిపి ప్రభుత్వానికి 117 మంది ఎమ్మెల్యే సపోర్ట్తో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కాగా వారిలో కాంగ్రెస్ , జేడిఎస్లకు చెందిన 13 మంది ఎమ్మెల్యేలు రాజీనామ చేయడంతో 104కు చేరింది. కాగా బీజేపీకి 105 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. ఇక రాజీనామ చేసిన 13 మంది ఎమ్మెల్యేల్లో 10 మంది వరకు ముంబాయి హోటల్లో క్యాంప్ వేశారు.