అణుబాంబులు ప్రయోగించం .. కానీ పరిస్ధితులు ప్రభావం చేస్తే తప్ప అని రాజ్నాథ్ కామెంట్
జైపూర్ : అణు బాంబులు ఉపయోగించబోమని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టంచేశారు. కానీ సమయం వచ్చినప్పుడు మాత్రం చెప్పలేమని కామెంట్ చేశారు. రాజస్థాన్ జైసల్మేర్లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చానీయాంశమయ్యాయి. కశ్మీర్ విభజనతో నెలకొన్న ఉత్కంఠతో రాజ్నాథ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
అణ్వస్త్రాలు వినియోగంచొద్దని భారతదేశ విధానమని చెప్పారు. దీనికి భారత్ కట్టుబడి ఉందని స్పష్టంచేశారు. అయితే భవిష్యత్లో ఏం జరుగుతుందో చెప్పలేమన్నారు. దీంతో రాజ్నాథ్ కామెంట్లు ఆసక్తికరంగా మారాయి. భారత్ను అణ్వస్త్ర శక్తిగా మార్చాలని అప్పటి ప్రధాని అటల్ బీహరి వాజ్ పేయి భావించారని పేర్కొన్నారు. అందుకోసమే పోఖ్రాన్లో ప్రయోగించామని పేర్కొన్నారు. రాజస్థాన్లోని జై సల్మేర్లో ఓ అంతర్జాతీయ కార్యక్రమంలో పాల్గొని ట్వీట్ చేశారు.
వాజ్ పేయి ప్రథమ వర్థంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కూడా ఆయన పాల్గొన్నారు. వాజ్ పేయికి రాజ్ నాథ్ నివాళులర్పించారు. భారత్ బాధ్యతాయుత అణ్వస్త్ర శక్తిగా అవతరించడం దేశంలోని ప్రతిపౌరుడు గర్వించదగ్గ విషయమన్నారు. దీనికి వాజ్పేయికి దేశం ఎప్పుడూ రుణపడి ఉంటుందన్నారు. 1998లో వాజ్ పేయి ప్రధాని బాధ్యతలు స్వీకరించిన నెలరోజుల్లో పోఖ్రాన్లో భూగర్భ అణు పరీక్షలు నిర్వహించారు.