16వ రౌండ్ చర్చలు.. మిలిటరీ చర్చలకు భారత్- చైనా అంగీకారం
తూర్పు లడఖ్ ఉద్రిక్త తర్వాత భారత్- చైనా మధ్య సంబంధాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. దీనికి సంబంధించి పలు మార్లు చర్చలు కూడా జరిగాయి. అయితే సీనియర్ మిలిటరీ కమాండర్ల మరోసారి చర్చలకు మంగళవారం అంగీకారం కుదిరింది. ఎల్ఏసీ వద్ద పరిస్థితి సద్దుమణిగించేందుకు ఇరు దేశాలు ప్రయత్నిస్తున్నాయి. సీనియర్ అధికారుల మధ్య సమావేశం వర్చువల్గా జరగనుంది.
ఇతర సమస్యలను పరిష్కరించడానికి దౌత్య, సైనిక మార్గాల ద్వారా చర్చలను కొనసాగించడానికి అంగీకరించారు. ద్వైపాక్షిక సంబంధాల్లో సాధారణ స్థితిని పునరుద్దరించే ప్రయత్నం చేస్తున్నారు.

పశ్చిమ సెక్టార్లో గల ఎల్ఏసీతోపాటు అన్ని రాపిడ్ పాయింట్ల నుంచి పూర్తిగా బలగాలను వెనక్కి తీసుకునే లక్ష్యంగా చర్చలు జరుపుతున్నారు. 16వ రౌండ్ సీనియర్ కమాండర్ల సమావేశాన్ని ముందు తేదీలో నిర్వహించడానికి అంగీకారం తెలిపారు.
15వ రౌండ్ జరిగిన చర్చలు 15వ పెట్రోలింగ్ పాయింట్ గురించి డిస్కషన్ చేశారు. కానీ అదీ సఫలీకృతం కాలేదు. ముందుగా పీపీ15 వద్ద రిజల్యూషన్ ఆశించారు. మిగిలిన రెండు ప్రాంతాలు డెమ్ చోక్, డెమ్ సాంగ్లో తేడాలు మాత్రం స్పష్టంగా కనిపించాయి. 14వ రౌండ్ చర్చల తర్వాత గాల్వాన్ వ్యాలీ, పాంగొంగ్ సరస్సుతో పాటు ఇతర చోట్ల దళాలను మాత్రం వెనక్కి తీసుకున్నాయి.












Click it and Unblock the Notifications