గిన్నిస్ రికార్డు: ప్రపంచంలోనే అతిపెద్ద బియ్యం బస్తా
న్యూఢిల్లీ: భారత్కు చెందిన ఇండియా గేట్ బాస్మతీ రైస్ బియ్యం బస్తా గిన్నిస్ రికార్డు పుటల్లోకి ఎక్కింది. 550 కేజీలకు పైగా బరువు కలిగిన ఈ బస్తాలో బియ్యాన్ని నింపడం ద్వారా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు దక్కించుకుంది.
భారత్కు చెందిన ఇండియా గేట్ క్లాసిక్ బాస్మతీ రైస్ బస్తా 'గల్-2016'లో రికార్డు సొంతం చేసుకుంది. ప్రపంచంలో బియ్యం ఉత్పత్తుల్లో అగ్రస్థానంలో ఉన్న ఇండియా గేట్ క్లాసిక్ రైస్ బ్రాండ్ వ్యాపారులు 550 కేజీల బాస్మతీ రైస్ను పాలిధీన్ బ్యాగులో నింపి ఈ రికార్డు నెలకొల్పారు.

ఈ బియ్యపు బస్తాను ఫిబ్రవరి 21 నుంచి 25 వరకు దుబాయ్లో జరుగుతున్న 'గల్-2016' ప్రదర్శనలో ఉంచారు. గిన్నిస్ బుక్లో చోటు దక్కించుకోవడంపై ఇండియా గేట్ బాస్మతీ రైస్ ఎగుమతిదారైన కేఆర్బీఎల్ లిమిటెడ్ బోర్డు డైరెక్టర్లో ఒకరైన ప్రియాంక మిట్టల్ సంతోషాన్ని వ్యక్తం చేశారు.
గుల్పుడ్ ఫెస్టివల్ పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత ఏదైనా షాపింగ్ మాల్లో కానీ, రిటైల్ షాపులో కానీ కొంత కాలం ఉంచుతామని, అనంతరం ఈ బియ్యాన్ని కార్మికులకు పంపిణీ చేస్తామని ఆమె పేర్కొన్నారు. గిన్నిస్ బుక్లో చోటు దక్కించుకోవడంతో సర్టిఫికెట్ను బహుకరించారు.
-
92 వేల టన్నుల LPGతో భారత్ కు రెండు నౌకలు.. హర్మూజ్ జలసంధి గుండా.. -
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్












Click it and Unblock the Notifications