కరోనా వ్యాక్సిన్ డోసుల అతిపెద్ద కొనుగోలుదారుగా భారత్ .. వెల్లడించిన నివేదిక
ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి తన పంజా విసురుతూనే ఉంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 1.5 మిలియన్ల మంది ప్రాణాలు తీసిన కరోనావైరస్ మహమ్మారిని ఎదుర్కోవటానికి దేశాలు వ్యాక్సిన్లను తయారు చేస్తున్నాయి. ఇప్పటికే వ్యాక్సిన్ల తయారీలో యూఎస్, ఇండియా, రష్యా తదితర దేశాలు పోటీపడుతున్నాయి. అయితే కరోనా వైరస్ విజృంభణ కట్టడి చేయడం కోసం వ్యాక్సిన్ డోసులను సొంతం చేసుకునే విషయంలో అతి పెద్ద కొనుగోలుదారుగా అవతరించింది ఇండియా .

1,600 మిలియన్ల చొప్పున టీకా మోతాదును అత్యధికంగా కొనుగోలు చేసిన భారత్
1,600 మిలియన్ల చొప్పున టీకా మోతాదును అత్యధికంగా కొనుగోలు చేసిన దేశంగా భారత్ అవతరించింది. యుఎస్ డ్యూక్ విశ్వవిద్యాలయం ఒక అధ్యయనం లాంచ్ అండ్ స్కేల్ స్పీడ్ మీటర్ నివేదిక ప్రకారం భారత్ ఎక్కువ డోసులను కొనుగోలుచేసిన దేశం . పదహారు వందల మిలియన్ల డోసులతో యూరోపియన్ యూనియన్ రెండో స్థానంలో నిలిస్తే , 1000 మిలియన్ల డోసులతో అమెరికా మూడో స్థానంలో నిలిచింది.

ఉత్పత్తి సంస్థలతో ఒప్పందాలలో భారత్ ముందంజ
వ్యాక్సిన్ సేకరణ యొక్క సామర్థ్యాన్ని గుర్తించడానికి మరియు గ్లోబల్ ఈక్విటీ సవాళ్లను బాగా అర్థం చేసుకోవడానికి, నార్త్ కరోలినాకు చెందిన విశ్వవిద్యాలయం కోవిడ్ -19 వ్యాక్సిన్ టీకాలను మరియు స్థితిని గుర్తించడానికి పరిశోధనలు నిర్వహించింది.ఉత్పాదక ఒప్పందాలలో భాగంగా ప్రముఖ టీకా సంస్థలతో భారతదేశం మరియు బ్రెజిల్ వంటి ఉత్పాదక సామర్థ్యం ఉన్న దేశాలు ముందస్తుగా టీకాలను సేకరించే ఒప్పందాలు చేసుకోవడంలో విజయవంతమయ్యాయి .

ప్రపంచ జనాభా మొత్తానికి కావాల్సిన టీకాల లభ్యత 2023 లేదా 2024 వరకు పట్టొచ్చు
జపాన్, కెనడా మరియు యునైటెడ్ కింగ్డమ్ ఇప్పటివరకు 400 మిలియన్ల కంటే తక్కువ గా వ్యాక్సిన్ మోతాదులను కొనుగోలు చేశాయి. మొత్తం ప్రపంచ జనాభాను కవర్ చేయడానికి తగినంత టీకాలు ఉండవని డ్యూక్ విశ్వవిద్యాలయం సూచించింది. అందరికీ టీకాల లభ్యత 2023 లేదా 2024 వరకు పట్టొచ్చని అంటున్నారు . అధిక ఆదాయ దేశాలు 3.8 బిలియన్ల ధృవీకరించబడిన వ్యాక్సిన్ మోతాదులను కలిగి ఉన్నాయని, మధ్య ఆదాయం ఉన్న దేశాలు 829 మిలియన్ మోతాదులను కలిగి ఉండగా, తక్కువ ఆదాయ దేశాలు 1.7 బిలియన్ మోతాదులకు పైగా వ్యాక్సిన్ డోసులను కొనుగోలు చేశాయని అధ్యయనం వెల్లడిస్తోంది.

వ్యాక్సిన్ సేకరణలో కీలకంగా అధిక ఆదాయ దేశాలు
చాలా అధిక-ఆదాయ దేశాలు కోవిడ్ -19 వ్యాక్సిన్ల పరిశోధన మరియు అభివృద్ధికి పెద్ద మొత్తంలో ప్రజా నిధులను పెట్టుబడి పెట్టడం ద్వారా మరియు వ్యాక్సిన్ సంస్థల పోర్ట్ఫోలియోలో పెద్ద ఎత్తున ఒప్పందాలు చేసుకోవడానికి పరపతి, కొనుగోలు శక్తి ద్వారా కొనుగోళ్లను చేయగలిగాయని అధ్యయనం పేర్కొంది.
భారతదేశం ఇప్పటివరకు 9.57 మిలియన్లకు పైగా కేసులు నమోదు చేసింది . కరోనా వైరస్ కారణంగా భారతదేశంలో 1,39,188 మంది మరణించారు.












Click it and Unblock the Notifications