మీరు అవసరం లేదు: చైనాకు రాహుల్ గాంధీ
కాశ్మీర్ అంశంలో తాము నిర్మాణాత్మక పాత్ర పోషిస్తామని చెప్పిన చైనా వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ శుక్రవారం స్పందించారు.
న్యూఢిల్లీ: భారత్-పాకిస్తాన్ మధ్య నెలకొన్న కాశ్మీర్ సమస్యపై తాము నిర్మాణాత్మక పాత్ర పోషిస్తామని చెప్పిన చైనా వ్యాఖ్యలపై ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ శుక్రవారం స్పందించారు.
కాశ్మీర్ సమస్య పరిష్కారానికి చైనా సహకారం ఏమాత్రం అవసరం లేదని చెప్పారు. కాశ్మీర్ అంటే భారత్ అని అలాగే భారత్ అంటే కాశ్మీర్ అని వ్యాఖ్యానించారు. భారత అంతర్గత వ్యవహారాల్లో ఇతరుల జోక్యం అవసరం లేదని కుండబద్దలుకొట్టారు.

ప్రస్తుతం నరేంద్ర మోడీ ప్రభుత్వం తీరు వల్ల జమ్ము కాశ్మీర్లో మరిన్ని ఉద్రిక్తతలు చెలరేగుతున్నాయని ఆరోపించారు. ఎన్డీయే ప్రభుత్వ విధానం వల్లే జమ్ము కాశ్మీర్ రగులుతోందన్నారు.
కాగా, కాశ్మీర్ అంశాన్ని పరిష్కరించేందుకు తాము సహకరిస్తామని ఇటీవల చైనా విదేశీమంత్రిత్వ శాఖ ప్రతినిధి వ్యాఖ్యానించారు. చైనా వ్యాఖ్యలను భారత్ అప్పట్లోనే తిప్పికొట్టింది. ప్రస్తుతం భారత్-చైనా సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.












Click it and Unblock the Notifications