Vande Bharat డిజైన్తో రూ.100 వెండి నాణెం విడుదల, కానీ చెల్లదు
దేశంలో విద్యుత్ రైళ్ల శతాబ్దిని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ప్రత్యేక రంగుల స్మారక నాణెం కలెక్టర్లలో ఆసక్తి రేపుతోంది. భారత రైల్వే చరిత్రలో మైలురాయిగా నిలిచిన ఈ ఘట్టానికి గుర్తుగా విడుదలైన రూ.100 నాణెం అరుదైన సంపాద్యంగా మారింది. ముఖ్యంగా వందేభారత్ రైలు చిత్రంతో రూపుదిద్దుకున్న ఈ నాణెం సేకరణకారుల దృష్టిని ఆకర్షిస్తోంది.
భారతదేశంలో తొలి విద్యుత్ రైలు 1925 ఫిబ్రవరి 3న అప్పటి బాంబేలో (ప్రస్తుత Mumbai) విక్టోరియా టెర్మినస్ నుంచి కుర్లా వరకు ప్రారంభమైంది. ఈ ప్రయాణంతో భారత రైల్వేలో ఆధునికీకరణకు శ్రీకారం చుట్టారు. అప్పటి నుంచి విద్యుతీకరణ దశలవారీగా విస్తరించి, నేటి పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా వేల కిలోమీటర్ల మార్గాలు విద్యుతీకరణకు లోనయ్యాయి. ప్రస్తుతం Indian Railways ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్వర్క్లలో ఒకటిగా ఎదిగింది.

Vande Bharat రైలు ప్రతిరూపం..
ఈ చారిత్రక ప్రయాణానికి 100 సంవత్సరాలు పూర్తవ్వడంతో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక స్మారక నాణెాన్ని విడుదల చేశారు. రూ.100 విలువ గల ఈ నాణెం 35 గ్రాముల బరువుతో రూపొందించబడింది. ఇందులో 50 శాతం వెండి, 40 శాతం రాగి, 5 శాతం నికెల్, 5 శాతం జింక్ మిశ్రమాలున్నాయి. నాణెం ముందుభాగంలో రంగుల్లో మెరిసే వందేభారత్ రైలు ప్రతిరూపం ఉండగా, వెనుక భాగంలో అశోక స్థంభం మరియు 'భారత ప్రభుత్వం' ముద్రించబడ్డాయి. ఈ నాణెన్ని India Government Mint Kolkata మింట్ చేసింది.
చలామణి కోసం కాకుండా..
సాధారణ చలామణి కోసం కాకుండా, కలెక్టర్ల కోసం మాత్రమే పరిమిత సంఖ్యలో ఈ నాణేలు మింట్ చేయడం విశేషం. ఫేస్ విలువ రూ.100 అయినప్పటికీ, వెండి మిశ్రమం మరియు మింటింగ్ ఖర్చుల కారణంగా అధికారిక ధర రూ.8,000కు పైగానే నిర్ణయించారు. ఇదే నాణెన్ని శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలం అనుమసముద్రం గ్రామానికి చెందిన నాణేల సేకర్త మహ్మద్ వాయిజ్ ఆన్లైన్లో జనవరి 13న రూ.8,072లకు కొనుగోలు చేశారు. శనివారం ఆయనకు కోల్కతా మింట్ నుంచి నాణెం అందింది. అరుదైన స్మారక నాణేలను సేకరించడం తనకు హాబీ అని వాయిజ్ తెలిపారు. విద్యుత్ రైళ్ల శతాబ్దిని గుర్తుచేసే ఈ ప్రత్యేక నాణెం తన సేకరణలో ఉండడం గర్వంగా ఉందని చెప్పారు.
భారతీయ రైల్వే ప్రగతికి ప్రతీకగా
రైల్వే రంగం దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచింది. విద్యుతీకరణ వల్ల ఇంధన వ్యయం తగ్గడం, కాలుష్యం నియంత్రణ, వేగవంతమైన రవాణా వంటి అనేక ప్రయోజనాలు సాధ్యమయ్యాయి. వందేభారత్ వంటి ఆధునిక రైళ్లు దేశ రవాణా రంగానికి నూతన దిశను చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో శతాబ్దిని పురస్కరించుకుని విడుదలైన ఈ రంగుల నాణెం భారతీయ రైల్వే ప్రగతికి ప్రతీకగా నిలుస్తోంది. భవిష్యత్తులో ఇటువంటి స్మారక నాణేలు విలువ మరింత పెరిగే అవకాశముందని నాణేల సేకరణకారులు భావిస్తున్నారు. విద్యుత్ రైళ్ల శతాబ్దిని స్మరించుకునే ఈ ప్రత్యేక నాణెం దేశ రైల్వే చరిత్రలో మరో గుర్తుగా నిలిచిపోనుంది.
-
కోనసీమ వాసుల కల నెరవేర్చే కొత్త రైల్వే లైన్ ప్రాజెక్ట్ లో కీలక అడుగు -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, మూడు రోజుల్లో పూర్తి..!! -
మార్చి 21 తర్వాత పాకిస్తాన్ ఉండదు- రాసిపెట్టుకోండి: బాంబు పేల్చిన జ్యోతిష్యురాలు -
today rashiphalalu: రాహుసూర్యుల శక్తివంతమైన యోగంతో ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
కుప్ప కూలుతున్న బంగారం ధరలు- బిగ్ డౌన్ ఫాల్ -
కక్ష్యను మార్చకోనున్న బుధుడు.. ఈ రాశుల జీవితం మారిపోతోంది -
అతడు ఇప్పుడు పక్కా మెంటల్లీ టఫ్: రవిశాస్త్రి -
సిగ్గుండాలి.. అనసూయ ఒక్క పోస్ట్తో సైలెన్స్! -
భారత్ కు డొనాల్డ్ ట్రంప్ గుడ్ న్యూస్.. -
ఫైనల్ వేళ టీమిండియాకు మాజీ కోచ్ హెచ్చరిక, అభిషేక్ బ్యాటింగ్ ఆర్డర్ ఇక..!! -
మీ పాత బంగారం చెల్లుతుందా? 2026 కొత్త నిబంధనలు ఇవే! -
EPF 2026 అమల్లోకి: డబ్బులు ఎన్నిసార్లు తీసుకోవచ్చో తెలుసా? -
T20 world cup Final: ఫైనల్ అభిషేక్ దే-తేల్చేసిన టీమిండియా హీరో..! -
ఇరాన్ పోరాటం వెనుక రహస్య ఆయుధం? యూఎస్-ఇజ్రాయెల్ కు చిక్కని సీక్రెట్..! -
జీహెచ్ఎంసీ వాసులకు బిగ్ న్యూస్.. వారి ఆస్తులు సీజ్ కు రంగం సిద్ధం!














Click it and Unblock the Notifications