వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మళ్లీ రెచ్చిన పాక్, భారత్ దీటైన జవాబు: 15 మంది పాక్ రేంజర్లు మృతి!

|
Google Oneindia TeluguNews

శ్రీనగర్: సరిహద్దుల్లో పాకిస్తాన్ మరోసారి రెచ్చిపోయింది. భారత్ బలగాలు ధీటైన సమాధానం ఇచ్చాయి. జమ్ము, కత్వా జిల్లాల్లో పాకిస్తాన్ గత రాత్రి నుంచి కాల్పులు జరుపుతోంది. ధీటుగా స్పందించిన ఇండియన్ ఆర్మీ ఎదురు కాల్పులు జరిపింది. ఈ ఘటనలో 15 మంది పాక్ రేంజర్లు హతమయ్యారని తెలుస్తోంది.

 India retaliates after Pak firing in Jammu, border villagers run for cover

భారత్ - పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తత నేపథ్యంలో సరిహద్దులోని గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సరిహద్దులోని దాదాపు 400 కుటుంబాలు అక్కడి నుంచి తరలి వెళ్లాయి. గురువారం రాత్రి నుంచి పాకిస్తాన్ దళాలు జమ్ములోని దాదాపు 24 మన సైన్యం పోస్ట్‌లను టార్గెట్ చేశాయి.

నౌషెరా, సుందర్భనీ, పల్లన్వాలా, హీరా నగర్, కాత్వా తదితర సెక్టారులలో పాక్ దళాలు కాల్పులు జరిపాయి. ఉధయం ఐదు గంటల వరకు కూడా ఉద్రిక్తత కొనసాగిందని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ (బీఎస్ఎఫ్) జమ్ము ఫ్రంటియర్ డిఐజీ ధర్మేంద్ర పరేక్ తెలిపారు.

English summary
Pakistani forces targeted at least 24 Indian posts in Jammu overnight, resorting to heavy firing that sparked panic among residents in villages along the border.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X