చాలా ఎక్కువైంది!: ప్రధాని మోడీకి షాకిచ్చిన అమెరికా
న్యూఢిల్లీ: భారత్ వృద్ధి రేటు పైన అమెరికా తాజాగా షాకిచ్చింది. తాము అధికారంలోకి వచ్చాక 7.5 శాతం వృద్ధి రేటు సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల అమెరికాలో చెప్పారు. దీనిపై అగ్రరాజ్యం సెటైర్లు వేసింది. చెప్పడమే తప్ప నిర్దేశించుకున్న లక్ష్యాలు ఏమీ లేవని తెలిపింది.
అమెరికా విదేసాంగ శాఖ 'ఇన్వెస్ట్మెంట్ క్లైమేట్ స్టేట్మెంట్స్ ఫర్ 2016' పేరిట విడుదల చేసిన నివేదికలో పైవిధంగా వ్యాఖ్యానించింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు సంబంధించి మోడీ సర్కార్ తీసుకున్న నిర్ణయాలు ఫరవాలేదని చెప్పింది.

అయితే, మిగతా విషయాలు, ప్రత్యేకించి ఆర్థిక సంస్కరణ అమలులో అనుకున్న వేగం లేదని పేర్కొంది. తాను ప్రతిపాదిస్తున్న సంస్కరణలను పార్లమెంటులో ఆమోదింప చేసుకునే విషయంలో ప్రధాని మోడీ సర్కార్ విఫలమవుతోందని పేర్కొంది.
భూసేకరణ బిల్లు ఆమోదం విషయంలో చోటు చేసుకున్న పరిణామాలను ఈ సందర్భంగా తన నివేదికలో ఉదహరించింది. భూసేకరణ బిల్లు వి,యంలో రాజకీయ పార్టీల మద్దతు పొందలేకపోయిందని పేర్కొంది. ప్రపంచటంలో భారత్ అత్యంత వేగవంగా అభివృద్ధి చెందుతున్న దేశమని చెప్పవచ్చునని, కానీ 7.5 శాతం వృద్ధి రేటు మరీ ఎక్కువగా చెప్పినట్లు అభిప్రాయపడింది.
-
భారత్ కు మెషిన్ గన్స్ పంపించిన ఇజ్రాయెల్.. పాకిస్థాన్ పని ఖతం.. -
భారత్ కు గుడ్ న్యూస్ చెప్పిన పాకిస్థాన్ -
గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగుతున్నారా - అయితే, ఇది మీ కోసమే..!! -
మైక్రోసాఫ్ట్, గూగుల్, ఆపిల్ సంస్థల్ని బూడిద చేస్తాం: అమెరికాకు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్.. -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!!











Click it and Unblock the Notifications