చలికాలంలో చైనాకు తడిసిపోయేలా - యాంటీ రేడియేషన్ మిసైల్ ‘రుద్రం-1’ - డీఆర్డీవో టెస్టు సక్సెస్
రాబోయే చలికాలంలో పూర్తిస్థాయి యుద్ధానికి సన్నాహాలు చేసుకుంటోన్న చైనాకు ప్యాంటు తడిసిపోయేలా భారత్ అత్యాధునిక ఆయుధ సంపత్తిని సిద్ధంచేసుకుంది. శత్రు దేశాల రాడార్లను మట్టి కరిపించే క్షిపణిని శుక్రవారం విజయవంతంగా పరీక్షించింది. దేశ రక్షణ రంగంలో కీలకమైన ముందడుగుగా భావిస్తోన్న 'రుద్రం-1' క్షిపణికి సంబంధించి రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) శుక్రవారం కీలక ప్రకటన చేసింది..

యాంటీ రేడియేషన్..
సుఖోయ్-30ఎంకేఐ యుద్ధ విమానాల ద్వారా ప్రయోగించే వీలున్న ‘రుద్రం-1' క్షిపణి... శత్రు దేశాల రాడార్లను, నిఘా వ్యవస్థలను దెబ్బతీయగలదు. ధ్వని వేగం కంటే రెట్టింపు వేగంతో దూసుకెళ్ళగలిగే ఈ అత్యాధునిక విస్సైల్ ను ‘‘వ్యూహాత్మక యాంటీ రేడియేషన్ మిసైల్''గానూ వ్యవహరిస్తున్నారు. 250 కిలోమీటర్ల పరిథిలో రేడియేషన్ను వెలువరించే లక్ష్యాన్ని ఛేదిస్తుంది. . రేడియో తరంగాల ద్వారా వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న రేడార్లను ఈ మిస్సైల్ గుర్తించగలదు.

సుఖోయ్ యుద్ద విమానాల ద్వారా..
‘రుద్రం-1' మిస్సైల్ ను శుక్రవారం ఉదయం 10.30 గంటలకు విజయవంతంగా పరీక్షించామని, ఒడిశాలోని బాలాసోర్ నుంచి దీనిని ప్రయోగించామని డీఆర్డీవో అధికారికంగా ప్రకటించింది. సుఖోయ్-30ఎంకేఐ యుద్ధ విమానం నుంచి కూడా ప్రయోగించగలిగే ఈ మిసైల్ శత్రు దేశాల రాడార్లను, నిఘా వ్యవస్థలను దెబ్బతీయగలదు.
Recommended Video

15కి.మీ ఎత్తు నుంచి కూడా..
న్యూ జనరేషన్ యాంటీ రేడియేషన్ మిస్సైల్ గా పరిగణించే రుద్రం-1.. పరిధి విషయానికొస్తే.. దాన్ని తీసుకెళ్లే యుద్ధ విమానాల ఎత్తును బట్టి ఉంటుంది. అంటే, గరిష్టంగా 15 కిలోమీటర్ల ఎత్తు నుంచి కూడా దీన్ని ప్రయోగించవచ్చన్నమాట. ఈ మిసైల్తో శత్రు దేశాల గగనతల రక్షణ వ్యవస్థను దెబ్బతీయగలిగే వీలుంటుంది. ఇటీవల వరుసగా క్షిపణి పరీక్షలను డీఆర్డీవో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. కొన్ని రోజుల క్రితమే భారత్.. స్మార్ట్ టార్పిడో మిస్సైల్ను పరీక్షించింది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications